కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ చెన్నై కార్యాలయం సేఫ్టీ కస్టడీలోని సుమారు 103 కిలోల బంగారం మాయం కావడం తీవ్ర కలకలాన్ని రేపింది. మాయం అయిన బంగారం విలువ దాదాపు 45 కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా.
2012లో తమిళనాడులో సీబీఐ అధికారులు 103 కేజీల బంగారం సీజ్ చేశారు. దీనికి సంబందించిన కేసు చెన్నై కోర్టులో నడుస్తున్నది. ఈ కేసు విచారణ సందర్భంలో సీజ్ చేసిన బంగారంను కోర్టులో హాజరు పర్చాల్సి ఉండగా సిబిఐ చేతులు ఎత్తేసింది. దీనితో విషయం వెలుగులోకి వచ్చింది. తాము స్వాధీనం చేసుకున్న సమయంలోనే కొలతల్లో మిస్ అయినట్లు కోర్టుకు సీబీఐ విన్నవించింది. దీనిపై కోర్టు సీరియస్ అయ్యింది. సీబీఐ ప్రతిష్ట ను ఇది మచ్చ లాంటిది గా కోర్టు పేర్కొన్నది. ఎఫ్ ఐ ఆర్ నమోదు చేసి దర్యాప్తు చేయాలని సీబీ సీఐడిని ఆదేశించింది. సిబిఐ కార్యాలయం లో జరిగిన బంగారం మాయం కేసును సిబీ సీ ఐ డి దర్యాప్తు చేయడం విశేషం.