Breaking: లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ అధికారులు హైదరాబాద్ అరబిందో ఫార్మా డైరెక్టర్ శరత్ చంద్రారెడ్డి, మరో నిందితుడు వినయ్ బాబును అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. వీరిని ఈడీ అధికారులు సీబీఐ ప్రత్యేక కోర్టులో హజరుపర్చారు. 14 రోజుల కస్టడీకి అనుమతి ఇవ్వాలని ఈడీ కోర్టును కోరింది. విచారణ సమయంలో నిందితులు సహకరించలేదని, ఈ కేసులో కోట్లాది రూపాయల మనీలాండరింగ్ జరిగిందనీ ఈడీ తరపు న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకువచ్చారు.
శరత్ చంద్రారెడ్డి తరపు న్యాయవాదులు వాదనలు వినిపించారు. ఈడీ అధికారులు విచారణ సమయంలో కొట్టి సంతకాలు తీసుకున్నారనీ, శరత్ చంద్రారెడ్డి ఆరోగ్యంగా లేరని బెయిల్ మంజూరు చేయాలని కోరారు. మరో పక్క వినయ్ బాబు తరపున న్యాయవాదులు ఈ కేసులో ఎటువంటి సంబంధం లేకపోయినా అరెస్టు చేశారని చెప్పారు. ఇరుపక్షాల వాదనలు విన్న సీబీఐ ప్రత్యేక కోర్టు వారం రోజుల పాటు కస్టడీలోకి తీసుకుని విచారించేందుకు అనుమతి ఇచ్చింది.