విద్యార్థులు ఎదురుచూస్తున్న సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) ఇంటర్మీడియట్ సెకండియర్ పరీక్షల (12వ తరగతి) ఫలితాలు విడుదలయ్యాయి. సోమవారం నాడు ఫలితాలను సంబంధిత మంత్రిత్వశాఖ అధికారులు విడుదల చేశారు. ఫలితాలను అధికారిక వెబ్సైట్లలో అందుబాటులో ఉంచారు.
ఫిబ్రవరి 15 నుంచి మార్చి 30, 2020 వరకు జరిగిన ఈ పరీక్షల ఫలితాలు ఎప్పుడో రావాల్సి ఉండగా దేశంలో లాక్డౌన్ విధించిన నేపథ్యంలో పేపర్లు వాల్యువేషన్లో జాప్యం జరిగింది. ఈ ఏడాది 88.78శాతం పాస్ పర్సెంటేజ్ను నమోదు చేసింది.
ఇక ఎప్పటిలానే ఈ సారి తిరువనంతపురం 97.67 శాతం పాస్ పర్సంటేజ్తో తొలిస్థానంలో నిలువగా రెండో స్థానంలో (97.05%) బెంగళూరు నిలిచింది. మూడో స్థానంలో చెన్నై (96.17%) నిలిచింది. గతేడాది ఉత్తీర్ణత శాతం 83.40గా ఉండగా ఈ సారి 88.78శాతంగా ఉంది. అంటే ఉత్తీర్ణత శాతం 5.38శాతం పెరిగింది.