ఢిల్లీ మార్చి 1 : దేశంలో సార్వత్రిక ఎన్నికలు నిర్ణీత సమయానికే నిర్వహిస్తామని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సునీల్ అరోరా శుక్రవారం స్పష్టం చేశారు.
పుల్వామా ఉగ్రవాద దాడి నేపథ్యంలో భారత్-పాకిస్తాన్ల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల ప్రభావం లోక్ సభ ఎన్నికల నిర్వహణపై ఉండదని అరోరా తెలిపారు.
ఎప్పటిలాగే నియమం ప్రకారం విలేకర్ల సమావేశం ఏర్పాటు చేసి ఎన్నికల తేదీలను తెలియజేస్తామన్నారు.
ఎన్నికల సంఘం విడుదల చేసిన కొత్త నోటిఫికేషన్ ప్రకారం ఇకపై అభ్యర్థులు తమ భారత్ లోని ఆస్తుల గురించే కాకుండా విదేశాలలోని వారి ఆస్తిపాస్తుల వివరాలను కూడా సమర్పించాల్సి ఉంటుందన్నారు. వాటిని ఆదాయపన్ను శాఖ పరిశీలిస్తుందని, ఏవైనా వ్యత్యాసాలు కనిపిస్తే ఎన్నికల సంఘం వెబ్ సైట్లో వాటిని అప్లోడ్ చేసి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆరోరా వివరించారు.