Vizag Steel Plant : ఆంధ్రప్రదేశ్లో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఏపీ లో జరుగుతున్న ఆందోళనలను అసలు కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ప్లాంట్ లో పనిచేస్తున్న వేలాది మంది కార్మికుల నిరసనలు, ఆందోళనలు బిజెపి ప్రభుత్వం చాలా లైట్ తీసుకుంటోంది. గంటా శ్రీనివాసరావు రాజీనామా చేశాడు. ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఏకంగా లేఖ రాశారు… ప్రతిపక్ష నేత చంద్రబాబు కూడా చివరికి దీనిపైన స్పందించారు. అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం నా దారి రహదారి అన్నట్లు వ్యవహరిస్తోంది.
ఉక్కు కార్మాగారం ప్రైవేటీకరణ ప్రణాళికతో ముందుకు సాగాలని వారు నిర్ణయించుకున్నట్లు సమాచా.రం ఢిల్లీ నుండి వచ్చిన సమాచారం ఏమిటంటే వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కోసం కేంద్రం ఒక ప్రణాళికను సిద్ధం చేసిందట. సాంకేతిక వివరాలు ప్లాంట్ సామర్థ్యం.. దాని ఆస్తులను బిడ్ పత్రంలో చేర్చడానికి సమర్పించాలని పరిశ్రమల శాఖకు పిలుపునిచ్చినట్లు దేశ రాజధాని నుండి నివేదికలు వచ్చాయి. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖపట్నం ఉక్కు కర్మాగారం కు వ్యతిరేకంగా అన్ని రాజకీయ పార్టీలు గళం విప్పారు.
ఏపీ భారతీయ జనతా పార్టీ నాయకులు తాము కూడా ప్రణాళికను విరమించుకోవాలని కేంద్రంపై ఒత్తిడి చేస్తామని ప్రకటించారు. అన్నీ రాజకీయ పార్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా… ముఖ్యమంత్రి జగన్ మరొక్కసారి పరిశీలించమని చెప్పినా కూడా కేంద్ర ప్రభుత్వం దానికి మొగ్గు చూపకపోవడం గమనార్హం. మరోవైపు జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ప్రైవేటీకరణ ప్రణాళిక నిలిపివేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తుంది.
అదే క్రమంలో మంగళవారం సమావేశమైన మంత్రివర్గం అసెంబ్లీలో కూడా ఆ తీర్మానాన్ని ఆమోదించాలని నిర్ణయించారు. అయినప్పటికీ కేంద్రం మాత్రం ఉక్కు కార్మాగారాన్ని వదిలించుకోవడానికి…. ప్రైవేటు పార్టీలకు దానిని అప్పగించేందుకు ముందుకు వెళ్తున్నట్లు అర్థం అవుతోంది.