ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బిజెపి పార్టీ మెల్లమెల్లగా బాధపడుతున్న సంగతి తెలిసిందే. ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ కంటే చాలా విషయాలలో ప్రభుత్వం పై బిజెపి పోరాడుతూ వస్తుంది. రాష్ట్రంలో బిజెపి పార్టీకి చెందిన కీలక నాయకులు… టిడిపి స్థానాన్ని భర్తీ చేసే రీతిలో ప్రభుత్వంపై దూకుడుగా వ్యవహరిస్తూ వస్తున్నారు.
దేవాలయాలపై దాడులు విషయంలోగాని మరి కొన్ని విషయాల్లో గాని వైసీపీ ప్రభుత్వాన్ని గట్టిగానే ఇరుకున పెట్టే రీతిలో అప్పట్లో వ్యవహరించడం జరిగింది. ఇదిలా ఉండగా కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి పార్టీకి ఇతర పార్టీల మద్దతు రోజురోజుకి తగ్గటంతోపాటు బీహార్ ఎన్నికలలో దెబ్బ పడే అవకాశం ఉన్నట్లు ఎగ్జిట్ పోల్స్ రావటంతో ముందు జాగ్రత్త పడే విధంగా రాష్ట్రాలపై శ్రద్ధ పెంచినట్లు వార్తలు వస్తున్నాయి.
దీనిలో భాగంగా ఆంధ్రప్రదేశ్ విషయంలో భారీ వ్యయంతో కేంద్రం ఉన్నట్లు జాతీయ స్థాయి లో టాక్ నడుస్తుంది. నిధుల విషయంలో కేంద్రం పై విమర్శలు వస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలో త్వరలో భారీ స్థాయిలో నిధులు విడుదల చేయడానికి కేంద్ర పెద్దలు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. దీంతో రాష్ట్రాన్ని బిజెపి ప్రభుత్వం ఆదుకున్నట్లు మాత్రమే కాక వైసీపీకి దగ్గర అయ్యే అవకాశం ఉండటంతో ఈ వ్యూహాన్ని కేంద్రం త్వరలో రాష్ట్రంలో అమలు చేయాలని ఆలోచన చేస్తున్నట్లు టాక్ నడుస్తుంది. దీనికి సంబంధించి ప్రధాని మోడీ ఇప్పటికే ఆర్థిక శాఖకు కొన్ని సూచనలు కూడా చేసినట్లు వార్తలు వస్తున్నాయి. పోలవరం విషయంలో అదే విధంగా ప్రత్యేక హోదా విషయంలో బీజేపీ మోసం చేసింది అన్న భావన ఏపి ప్రజల లో ఉందన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో మరీ అంత నెగిటివిటీ పార్టీపై పడకుండా బిజెపికి ప్రస్తుతం బలపడే అవకాశం ఉండటంతో..బీజేపీ పెద్దలు ఏపీ విషయంలో ఆలోచన ధోరణి మార్చుకున్నట్లు పరిశీలకుల మాట.