Central Cabinet: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర మంత్రి మండలి పునర్వ్యవస్థీకరణ ఖాయంగా కనబడుతోంది. అయిదు రాష్ట్రాల ఎన్నికల వేళ ఎవరికి అవకాశం లభిస్తుంది..మార్పులు చేర్పులు ఏమైనా ఉంటాయా అన్నదానిపై దేశ వ్యాప్తంగా ఆసక్తికర చర్చ జరుగుతోంది. కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చిన కేబినెట్ విస్తరణ ఎట్టకేలక ముహూర్తం ఖరారు అయినట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. జూలై మొదటి వారంలో కేంద్ర కేబినెట్ విస్తరణ జరగనుందని వార్తలు వస్తున్నాయి. జూలై రెండు మూడో వారంలో పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జరగనున్నాయి. యూపీ పర్యటన ముగించుకుని రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ నేడు ఢిల్లీ చేరుకోనున్నారు. నేడో రేపో కేబినెట్ విస్తరణకు సంబంధించి సమాచారం పిఎంఓ అందించనున్నది.
Read More: Mansas Trust: టార్గెట్ అశోక్ గజపతి ఫిక్స్..! వారంలోనే అరెస్టు..!?
Central Cabinet: మంత్రివర్గ విస్తరణపై పూర్తయిన కసరత్తు
ఇప్పటికే మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణ కసరత్తు ను ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, హోంశాఖ మంత్రి అమిత్ షా, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపి నడ్డా పూర్తి చేసినట్లు సమాచారం. కొత్తగా 20 మందికిపైగా నేతలకు స్థానం కల్పించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 2019లో మంత్రివర్గం ఏర్పాటు తరువాత మొదటి సారి కేబినెట్ విస్తరణ జరగనున్నది. ఇటీవల కాలంలో కేబినెట్ మంత్రులుగా ఉన్న రాంవిలాస్ పాశ్వన్, సురేశ్ అంగడి మరణించడం, అనేక మంది మంత్రులు ప్రస్తుతం ఒకటికి మించి శాఖలను నిర్వహిస్తున్న నేపథ్యంలో కేబినెట్ విస్తరణకు పూనుకుంటున్నట్లు సమాచారం. కేబినెట్ విస్తరణలో ప్రధానంగా యూపీ, గుజరాజ్, లద్ధాక్, హర్యానా, కర్నాటక, ఒడిశా, బీహార్, రాజస్థాన్, ఢిల్లీ, బెంగాల్ రాష్ట్రాల నేతలకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.
ఏపికి నో ఛాన్స్
2018లో ఎన్డీఏ నుండి టీడీపీ బయటకు వచ్చేసిన తరువాత కేంద్ర మంత్రులుగా ఎవరూ లేరు. ఏపి నుండి బీజేపీ రాజ్యసభ సభ్యులు సుజనా చౌదరి, టీజీ వెంకటేష్, సీఎం రమేష్, ఉత్తర ప్రదేశ్ నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న జీవిఎల్ నర్శింహరావులు ఉన్నప్పటికీ వీరికి ఎవరికి చాన్స్ లేదని వార్తలు వస్తున్నాయి. వీరిలో జీవిఎల్ మినహా మిగిలిన ముగ్గురు టీడీపీ నుండి బీజేపీలోకి విలీనమైనవారు. కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురంద్రీశ్వరి ఉన్నప్పటికీ ప్రస్తుతం ఆమె ఎంపిగా లేరు. ఇటీవల జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పేరు వినిపించినప్పిటకీ అదంతా పుకారేనని తేలిపోయింది. ఈ సారి ఏపి నేతలకు అవకాశం ఇవ్వకపోతే వచ్చే మూడేళ్ల వరకూ ఎవరూ కేంద్ర మంత్రులుగా లేనట్లే.