Vishakapatanam: ఇటీవల వర్షాకాల పార్లమెంట్ సమావేశాలు జరిగిన సంగతి తెలిసిందే. కొన్ని వారాల పాటు జరిగిన ఈ సమావేశంలో పెట్రో ధరల విషయంలో విపక్షాలు.. అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన లిస్టులో.. ఏపీ రాజధాని గా విశాఖపట్టణాని తాజాగా అధికారికంగా గుర్తించడం జరిగింది. 26 జులై 2021 న లోక్ సభలో దేశంలో పెట్రోల్ రేట్లు పెరుగుదల ప్రభావం గురించి అడిగిన ప్రశ్నకు సమాధానంగా కేంద్ర ప్రభుత్వం ఆంధ్ర ప్రదేశ్ రాజధానిగా విశాఖను అధికారంగా ధృవీకరించింది. ఈ పరిణామంతో వైసీపీ పార్టీ నేతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎప్పటినుండో తెలుగుదేశం పార్టీ అమరావతి నే ఏకైక రాజధానిగా ఉంచాలని.. కోరుతున్నారు.
కానీ జగన్ ముఖ్యమంత్రి అయ్యాక రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలని తెలియజేస్తూ మూడు రాజధానుల కాన్సెప్ట్ తెరపైకి తీసుకు రావడం తెలిసిందే. కాగా ఈ మూడు రాజధానుల లో ఒక రాజధానిగా విశాఖ పట్టణాన్ని వైసిపి ప్రభుత్వం ఎన్నుకోవడం జరిగింది. ఈ క్రమంలో విశాఖపట్నాన్ని మెయిన్ రాజధానిగా కేంద్రం తాజాగా ధృవీకరించడం తో.. వైసిపి నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిణామంతో ప్రతిపక్ష పార్టీ టీడీపీ కి ఊహించని షాక్ ఇచ్చినట్లు అయింది. మరోపక్క అమరావతిని ఏకైక రాజధానిగా ఉంచాలని… ఆ ప్రాంతానికి చెందిన రైతులు ఎప్పటినుండో నిరాహార దీక్షలు చేస్తూ ఉన్నారు. ఇలాంటి తరుణంలో కేంద్రం ఏపీ రాజధానిగా విశాఖపట్టణానికి అధికారికంగా తెలియజేయడం ఏపీ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తోంది.
మొదటి నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానికి సంబంధించి.. కన్ఫ్యూజన్ ఉంది. చంద్రబాబు అధికారంలో ఉన్న సమయంలో అమరావతిని రాజధానిగా గుర్తించి.. అనేక కార్యక్రమాలు చేపట్టారు. ఏకంగా దేశ ప్రధాని మోడీ ని అమరావతి ప్రాంతానికి తీసుకురావటం అప్పట్లో సంచలనం సృష్టించింది. రాజధానిగా అమరావతి ని గుర్తించిన కానీ అక్కడ చంద్రబాబు హయాంలో ఒక్క పర్మినెంట్ భవనం కూడా కట్టలేని పరిస్థితి. అయితే ఆ తర్వాత జగన్ అధికారంలోకి వచ్చి మూడు రాజధానులు తెరపైకి తెచ్చారని అందరికీ తెలుసు. అయితే మూడు రాజధానులు విషయంలో కేంద్రం యొక్క వైఖరి ఏంటి అన్నది ఎవరికీ అర్థం కాని విధంగా మొన్నటి వరకు పరిస్థితి ఉన్న తరుణంలో తాజాగా పెట్రోల్ ధరల విషయంలో ఏపీ రాజధానిగా విశాఖ పట్టణాని కేంద్రం గుర్తించడం.. సంచలనంగా మారింది.