కేంద్ర ఎన్నికల సంఘం మోడీ ప్రభుత్వానికి సరికొత్త ఆదేశాలు ఇచ్చింది. మేటర్ లోకి వెళ్తే విదేశాల్లో ఉండే భారతీయులకు ఓటు హక్కు కల్పించే దిశగా ముందడుగు వేసింది. దీనికి సంబంధించిన ప్రతిపాదన మోడీ సర్కార్ కి పంపించింది. ఈ విషయంలో కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇస్తే విదేశాల్లో ఉన్న భారతీయ ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించాలని భావిస్తున్నారు.
ప్రస్తుతం సైనిక బలగాలకు అందుబాటులో ఉన్న ఈటీపీబీఎస్ (ఎలక్ట్రానికల్లీ ట్రాన్స్ మిటెడ్ పోస్టల్ బ్యాలెట్ సిస్టం) ను విదేశాల్లోని భారతీయులకు కూడా వర్తింపజేసేలా ఆలోచనలు చేస్తున్నారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే వచ్చే ఏడాది ఏప్రిల్-జూన్ మధ్యకాలంలో దేశంలో పలు రాష్ట్రాలకు జరగబోయే అసెంబ్లీ ఎన్నికలకు విదేశాల్లో ఉన్న భారతీయులు కూడా ఓటు హక్కు వేసే అవకాశం ఉంటుంది.
ఈ క్రమంలో విదేశాల్లో ఉన్న భారతీయులకు ఓటు హక్కు కల్పించాలని కేంద్ర ఎన్నికల సంఘం భావిస్తోంది. దేశంలో జరిగే ఎన్నికల సమయంలో చాలామంది విదేశాల్లో ఉన్న భారతీయుడు ఓటు హక్కును వినియోగించుకోవడం కోసం భారీగా ఖర్చు చేసి మరీ దేశానికి వస్తున్నారు. దీంతో సమయంతో పాటు డబ్బు కూడా పెద్ద ఎత్తున ఖర్చు చేస్తున్న పరిస్థితులు ఉండటంతో, వారికి శ్రమ తగ్గించే విధంగా కేంద్ర ఎన్నికల సంఘం.. మోడీ సర్కారు తో ఈ విధానం విషయంలో చర్చలు జరుగుతూ ఉంది. కేంద్రం ఓకే అయితే పోలింగ్ సమయంలో పోస్టల్ బ్యాలెట్ ఓట్లతోనే ఓటింగ్ ఉంటుందని సమాచారం.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?