కరొనా నుంచి తమను తాము కాపాడుకునేందుకు మాస్క్ లు ఉపయోగించాలని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. మాస్కులు పెట్టుకోని వారిపై ఫైన్ విధిస్తున్నాయి ప్రభుత్వాలు. ఫైన్ కు భయపడి కాకపోయినా ఆరోగ్యం విషయంలో ఇంత పెద్ద ఎత్తున జరుగుతున్న ప్రచారం జరగడంతో అందరూ మాస్క్ ధరిస్తున్నారు. ఈ నేపథ్యంలో మరింత జాగ్రత్తల కోసం ఎన్95 మాస్కులు కూడా ధరిస్తున్నారు. అయితే ప్రత్యేకించి ఈ మాస్క్స్ పై కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రకటన ఆశ్చర్యం కలిగిస్తోంది.
రెస్పిరేటరీ వాల్వ్ ఉన్న ఎన్ 95 మాస్క్ల వల్ల వైరస్ను అడ్డుకోవడం కష్టమని కేంద్రం భావిస్తోంది. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర ఆరోగ్య శాఖ ముఖ్య అధికారి లేఖ కూడా రాశారు. నిజానికి గతంలో ఎన్95 మాస్కులు ప్రజలు ధరించొద్దు.. వైద్యులకు, సిబ్బందికి అందుబాటులో ఉండేలా చేయాలని వార్తలు వచ్చాయి. ఈ మాస్క్ల వినియోగంతో వైరస్ వ్యాప్తి అరికట్టడం సాధ్యమయ్యే అవకాశాలు తక్కువనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.
వైధ్య సిబ్బంది వినియోగించేందుకు తయారు చేసిన ఆ మాస్క్లు ప్రజలు ఎక్కువగా వాడటం ఆందోళన కలిగిస్తుందని ఆ లేఖలో పేర్కొంది. ప్రజలు సాధారణ మాస్క్ లు ఉపయోగిస్తేనే మంచిదని సూచిస్తోంది. ఇంట్లో మాస్క్లు తయారు చేసుకునేందుకు కేంద్రం కొన్ని మార్గదర్శకాలను విడుదల చేసింది. వాటిని అనుసరిస్తూ మాస్క్ లు తయారుచేసి వినియోగించాలని లేఖలో పేర్కొన్నారు.