సోనియా గాంధీ కుటుంబానికి ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఊహించని షాక్ ను ఇచ్చింది. గాంధీ కుటుంబానికి చెందిన ఛారిటబుల్ ట్రస్ట్లు ఐటీ శాఖ చట్టాలను ఉల్లంఘించాయని ఎప్పటినుండో ఆరోపణలు ఉన్న నేపథ్యంలో వాటిపై విచారణకు హోంశాఖ ప్రత్యేక కమిటీని నియమించింది.
సోనియా గాంధీ కుటుంబానికి రాజీవ్ గాంధీ ఫౌండేషన్, రాజీవ్ గాంధీ చారిటబుల్ ట్రస్ట్, ఇందిరా గాంధీ మెమోరియల్ ట్రస్ట్ లు ఉన్నాయి. ఈ ట్రస్ట్లకు చైనా ఎంబసీ నుండి నిధులు వచ్చాయని బిజెపి ఆరోపిస్తోంది. దీంతో ఆయా ట్రస్ట్ లకు చెందిన అక్రమ లావాదేవీలపై విచారణ జరపాలని అంతర్ మంత్రిత్వ కమిటీని హోంశాఖ నియమించింది. ఈ కమిటీకి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, ప్రత్యేక అధికారిగా నేతృత్వం వహిస్తారు. ఈ అంశం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది.