ఏపి రాజధాని అంశం కోర్టులో ఉందనీ, దీనిపై మాట్లాడటం సబ్ జ్యూడిస్ అవుతుందని కేంద్రం పేర్కొంది. రాజ్యసభలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి .. రాజధాని నిర్ణయాధికారం రాష్ట్రానికి ఉంటుందని కేంద్రం చెప్పిందా అని అడిగిన ప్రశ్నకు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ సమాధానం ఇచ్చింది. విభజన చట్టం ప్రకారమే ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని ఏపి ప్రభుత్వం 2015లోనే నోటిఫై చేసిందని తెలిపింది. సెక్షన్ 5,6 ప్రకారమే రాజధాని ఏర్పాటైందని చెప్పింది.

ఏపి ప్రభుత్వం 2020లో మూడు రాజధానుల బిల్లును తెచ్చిందని, అయితే ఆ బిల్లు తెచ్చే ముందు ఏపి ప్రభుత్వం తమను సంప్రదించలేదని తెలిపింది. రాజధానిపై హైకోర్టు తీర్పునకు వ్యతిరేకంగా ఏపి ప్రభుత్వం సుప్రీం కోర్టులో పిటిషన్ వేయగా, ప్రస్తుతం ఈ అంశం కోర్టులో ఉందని స్పష్టం చేసింది.
ఫోన్ ట్యాపింగ్ కాదు .. ఫోన్ రికార్డింగ్యే .. కోటంరెడ్డి ఆరోపణ తేలిపాయే..!