Arvind Kejriwal: కరోనా నియంత్రణ విషయంలో కేంద్రంపై తరచూ విమర్శలు గుప్పిస్తున్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కమలనాథులకు గొంతులో వెలక్కాయ గా మారారు.దీంతో ఆయనను కూడా ఏదో ఒక వివాదంలో ఇరికించే ప్రయత్నాన్ని బీజేపీ చేసింది.కానీ పెద్ద పాయింట్ ఏమీ దొరకలేదు.ఈ నేపధ్యంలో బాగా అధ్యయనం చేసి ఎవరూ ఊహించని ఒక పాయింట్ ను బిజెపి తెర మీదకు తెచ్చింది.సాక్షాత్తు కేంద్ర పర్యాటక మంత్రి ప్రహ్లాద్ పటేల్ ఈ విషయాన్ని బయటపెట్టారు.
కేంద్ర మంత్రి పట్టేసిన పాయింట్ ఏంటంటే?
ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఫ్లాగ్ కోడ్ ను పాటించడం లేదని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ పాటిల్ చెప్పారు.జాతీయ జెండా ను ప్రదర్శించే విషయంలో ఫ్లాగ్ కోడ్ అనేది ఒకటి ఉంటుందని ,సాక్షాత్తు ముఖ్యమంత్రి కేజ్రీవాల్ దీన్ని ఉల్లంఘిస్తున్నారని ఆయన చెప్పారు.ఈమధ్య కేజ్రీవాల్ తరచుగా మీడియా సమావేశాలు నిర్వహించి కరోనా అప్డేట్లు వివరిస్తున్నారు.ఈ సందర్బంగా ఆయన కూర్చునే కుర్చీ వెనుక జాతీయ జెండా కనిపిస్తోంది.దీన్నే ఇప్పుడు కేంద్రమంత్రి పాయింటౌట్ చేస్తున్నారు.జాతీయ జెండా ఉండాల్సిన రీతిలో ముఖ్యమంత్రి కుర్చీ వెనుక ఉండటం లేదని ప్రహ్లాద్ పాటిల్ చెప్పారు.జాతీయ జెండాను ఒక అలంకారంగా సీఎం వాడుకుంటున్నారని ఆయన ఆరోపించారు. సీఎం కుర్చీ వెనుక ఉండే జాతీయ జెండాలో మధ్యలో ఉండే తెల్ల గీత పూర్తిగా కనపడకుండా పచ్చ గీత మూసేస్తోందని ఆయన వివరించారు.ఇది రాజ్యాంగానికి విరుద్ధమని ,ఫ్లాగ్ కోడ్ ఉల్లంఘన కిందకు వస్తుందని కేంద్ర మంత్రి చెప్పారు.ఇది శిక్షార్హమైన నేరమని కూడా ఆయన అన్నారు.అయితే ఇది ముఖ్యమంత్రి కి తెలిసి జరుగుతుందో ..తెలియక జరుగుతుందో చెప్పలేనని,కానీ ఆయన చేస్తున్నది మాత్రం నేరమని ప్రహ్లాద్ పటేల్ పేర్కొన్నారు.ఇదే విషయాన్ని వివరిస్తూ ప్రహ్లాద్ పటేల్ కేంద్ర హోంశాఖకు ,ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ కు ఒక లేఖ కూడా రాశారు.కేజ్రీవాల్ పై చర్యలు తీసుకోవాలని కేంద్రమంత్రి వారిని కోరారు.
Read More: Ys Jagan: దేశంలో ఆ విషయంలో జగన్ ని ఫాలో అవుతున్న ఆ రాష్ట్ర ప్రభుత్వం..!!
Arvind Kejriwal: కేజ్రీవాల్ దాడిని తట్టుకోలేకేనా?
కాగా ఈ మధ్య కాలంలో కేజ్రీవాల్ కరోనా సహాయక చర్యల విషయంలో ,వ్యాక్సినేషన్ విషయంలో కేంద్రంపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు.ముఖ్యంగా వ్యాక్సిన్ కొరతను ఆయన ఎత్తి చూపుతున్నారు.కేజ్రీవాల్ చేస్తున్న ఆరోపణలను కేంద్రం సీరియస్ గా తీసుకోవడమే కాకుండా ఆయనకు ఒక స్ట్రాంగ్ కౌంటర్ కూడా రెండు రోజుల క్రితం ఇచ్చింది.అయినా కేజ్రీవాలే వెనక్కి తగ్గకపోవడంతో తాజాగా ఇప్పుడు జెండా వివాదాన్ని కమలనాథులు రేపారని పరిశీలకులు భావిస్తున్నారు.