Ys Jagan Mohan Reddy : మొట్టమొదటి సారి ముఖ్యమంత్రి అయ్యి రెండు సంవత్సరాలు పూర్తిగా నిండకముందే జగన్ తీసుకున్న నిర్ణయాలు దేశ వ్యాప్తంగా హైలెట్ అవుతున్న సంగతి తెలిసిందే.
అందువల్లే నేమో జగన్ ముఖ్యమంత్రి అయ్యాక దేశవ్యాప్తంగా జరుగుతున్న ప్రతి సర్వేలో టాప్ ఫైవ్ లో ఆయన స్థానం ఉంటుంది. చాలా వరకు జగన్ తీసుకున్న నిర్ణయాలు దేశంలో తల పండిపోయిన రాజకీయ నేతలను ఆలోచనలో పడేసినట్లు జాతీయ మీడియా సైతం కథనాలు ప్రసారాలు చేసిన సందర్భాలు ఉన్నాయి. ఒకానొక సందర్భంలో ప్రధాని మోడీ కూడా జగన్ ఏపీలో అమలు చేస్తున్న గ్రామ సచివాలయ వ్యవస్థను ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా తమ రాష్ట్రాల పరిధిలో అమలు చేయాలని సూచించడం జరిగింది. ఇదిలాఉంటే ఇటీవల కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ సమావేశాలలో జగన్ ఏపీలో అమలు చేస్తున్న ఓ కార్యక్రమాన్ని కాపీ కొట్టినట్లు మీడియా సర్కిల్స్ లో వార్తలు వైరల్ అవుతున్నాయి. విషయంలోకి వెళితే “నాడు-నేడు” అంటూ జగన్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలు అదేవిధంగా ప్రభుత్వ ఆసుపత్రుల రూపురేఖలు మారుస్తున్న సంగతి తెలిసిందే. ఈ తరహాలోనే తాజాగా పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశ పెట్టిన సమయంలో దేశవ్యాప్తంగా కేంద్ర పరిధిలో ఉండే పాఠశాలల రూపురేఖలు మార్చుతున్నట్లు “నాడు-నేడు” తరహాలో నేషనల్ ఎడ్యుకేషన్ స్కీమ్ లో దేశవ్యాప్తంగా 15 వేల స్కూళ్ల రూపురేఖలు మారుస్తున్నట్లు నిర్మల సీతారామన్ పార్లమెంట్ బడ్జెట్ ప్రసంగంలో తెలిపారు. దీంతో వైసీపీ శ్రేణులు ఈ వార్త తెలుసుకుని జగన్ నిర్ణయాలు ప్రజలకు మేలు చేసేవి, కాబట్టే కేంద్ర మంత్రులు అయిన ప్రధాని అయినా ఆయనను ఫాలో అవ్వాల్సిందే అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు.