Ration card: అవును.. సొంత ఇల్లు, రేషన్ కార్డ్ లేని వారికి కేంద్రం ఓ శుభవార్త చెప్పింది. మనలో అనేకమందికి ఏవేవో కారణాల చేత రేషన్ కార్డు ఉండకపోవచ్చు. అలాగే ఇల్లు లేని నిరు పేదలు కూడా మన చుట్టూ ఎంతోమంది వున్నారు. అయితే ఇపుడు ఇలాంటి వారికి కేంద్రం మేలు చేసే పనిలో పడింది. ముఖ్యంగా వీరికి సబ్సిడీ రేటుకి కొన్ని ఆహార ధాన్యాలు లభించవు. ఈ విషయం మనకు తెలిసినదే. ఇక కేంద్ర ప్రభుత్వం ఇలాంటి వారి డేటాను సేకరిస్తోంది. రేషన్ కార్డు లేని, ఇల్లు లేని పేదలకు కూడా సబ్సిడీ కింద ఆహార ధాన్యాలు ఇవ్వడానికి కంకణం కట్టుకుంది.
Colgate: కోల్గేట్ పేస్ట్ అక్కడ బ్యాన్ కానుందా? కోల్గేట్ కోసం బారులుతీరుతున్న జనం!
వారికి ఏ రూపంలో ఈ సబ్సిడీ వర్తిస్తుంది?
ప్రస్తుతం మన దేశంలో రేషన్ కార్డు కలిగిన వారికి కేజీకి రూ.1 నుండి 3 రూపాయిల ధరతో ఆహార ధాన్యాలు లభిస్తున్నాయి. ఈ విధానం ద్వారా దాదాపు 81 కోట్ల మందికి ప్రయోజనం పొందుతున్నారు. ఈ సబ్సిడీ ఆహార ధాన్యాలను రేషన్ కార్డు కలిగిన వారికి మాత్రమే అందిస్తున్నారు అనే సంగతి విదితమే. ఇకపోతే కేంద్ర ప్రభుత్వం ఇటీవల కరోనా వైరస్ సంక్షోభ సమయంలో రేషన్ కార్డు లేని వారికి కూడా ఉచితంగానే బియ్యం అందించింది. PMGKAY (ప్రధాన్ మంత్రి గరీబ్ కల్యాణ్ అన్నా యోజన) కింద ఈ ప్రయోజనాన్ని కల్పించింది.
Breaking: వాయిదా పడ్డ RRR మూవీ.. ప్రకటించిన చిత్ర బృందం..
ఈ వెసులుబాటు ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుంది?
తాజా సమాచారం ప్రకారం ఈ సంవత్సరం మార్చి నెల చివరి వరకు ఈ ప్రయోజనం అందుబాటులో ఉంటుంది. ఇల్లు లేని వారికి, రేషన్ కార్డు లేదా అడ్రస్ ప్రూఫ్ లేని వారికి ఈ ప్రయోజనం చేకూరనుంది. ప్రస్తుతం ఇల్లు లేని నిరుపేదలు అందరి వివరాలు సేకరిస్తోంది. కొత్త వ్యవస్థను అందుబాటులోకి తీసుకురావాలని యోచిస్తోంది. NFSA (జాతీయ ఆహార భద్రతా చట్టం) కింద దేశంలో 81 కోట్ల మంది లబ్ధిదారులు ఉన్నారని కేంద్రం పేర్కొంటోంది. మిగిలిన 1.6 కోట్ల మందిని కూడా NFSA కిందకు తీసుకురావాలని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలను వివిధ రాష్ట్రాలను కోరడం తెలిసినదే.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?