అమరావతి: ఈ నెల 19న న్యూఢిల్లీలో జరిగే ఒక కీలక సమావేశానికి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వైఎస్ జగన్మోహనరెడ్డి, కె చంద్రశేఖరరావుతో పాటు టిడిపి అధినేత చంద్రబాబుకు కేంద్రం లేఖలు రాసింది. ఈ సమావేశంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోది పాల్గొననున్నారు.
ప్రధానంగా ఐదు లక్ష్యాల సాధనకు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నారు.
1.పార్లమెంట్ ఔన్నత్యాన్ని పెంపొందించేందుకు చర్యలు.
2.ఒకే దేశం ఒకే ఎన్నికలు
3.75ఏళ్ల స్వాతంత్ర్యం సందర్భంగా నవభారత నిర్మాణం.
4.మహత్మాగాంధీ 150వ జయంతి వేడుకల నిర్వహణ.
5. వెనుకబడిన జిల్లాల అభివృద్ధి.
ఈ ఐదు అంశాలపై సమావేశంలో చర్చించనున్నారు.
పార్లమెంట్లో ప్రాతినిధ్యం వహిస్తున్న అన్ని పార్టీల అధ్యక్షులతో ఏర్పాటు చేస్తున్న ఈ ప్రత్యేక సమావేశానికి తప్పకుండా హజరుకావాలని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ లేఖలో కోరింది.
కాగా ఎన్నికల ముందు వరకూ కేంద్ర ప్రభుత్వాన్ని, ప్రధాని నరేంద్ర మోదిని తీవ్ర స్థాయిలో విమర్శించిన టిడిపి అధినేత చంద్రబాబు ఈ కీలక సమావేశానికి హజరవుతారా లేక పార్టీ తరపున ప్రతినిధిని ఎవరినైనా పంపుతారా అనేది వేచి చూడాలి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి మాత్రం రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన హామీల సాధనకు కేంద్రంతో సన్నిహత సంబంధాలు కొనసాగించాలని భావిస్తున్నందున తప్పకుండా వెళ్లే అవకాశాలు ఉన్నాయి.
previous post
next post