central government pension: కేంద్ర ప్రభుత్వం ఉద్యోగుల ఫ్యామిలీ పెన్షన్ పెంచాలని కీలక నిర్ణయం తీసుకున్నది. ఇది ఉద్యోగ కుటుంబాలకు ఊరట కల్గించే విషయం. దీనిలో చాలా మందికి ఉపయోగం కలుగుతుంది. కేంద్ర ఉద్యోగుల కుటుంబాలకు ఎక్కువ పెన్షన్ వస్తుంది. ఒక ఇంట్లో భార్య, భర్త ఇద్దరూ ప్రభుత్వ ఉద్యోగులైతే వారు మరణిస్తే కుటుంబ సభ్యులకు ఇద్దరి పెన్షన్ వస్తుంది. అయితే ఈ పెన్షన్ లిమిట్ నెలకు రూ.45వేలు దాటకూడదు. ఇప్పుడు ఈ లిమిట్ పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఇప్పటి నుండి ఉద్యోగుల కుటుంబాలకు పెన్షన్ గరిష్టంగా రూ.1.25 లక్షలు అందిస్తామని పెన్షన్ అండ్ పెన్షనర్స్ వెల్ఫేర్ శాఖ తెలిపింది. ఈ మేరకు కుటుంబ పెన్షన్లకు సంబంధించి 75 ముఖ్యమైన నిబంధనలు తీసుకొచ్చామని పెన్షనర్స్ వెల్పేర్ శాఖ ప్రకటించింది.
పెన్షన్ తీసుకునే వృద్ధుల్లో అవగాహన కోసం ఈ రూల్స్ ను తీసుకువచ్చినట్లు తెలిపింది. కొత్త నిబంధనల ప్రకారం కేంద్ర ప్రభుత్వం నుండి పెన్షన్ అందుకునే ఫ్యామిలీ గరిష్టంగా లక్షా 25వేలు అందుతుంది. వీటికి డీఆర్ సమయానుగుణంగా జత అవుతుంది. అలాగే నెలకు కనిష్టంగా రూ.9వేలు పెన్షన్ అందుకోవచ్చు. దీనికి కూడా డీఆర్ అదనంగా జత అవుతుంది.