Padma Awards 2023: పద్మశ్రీ అవార్డు గ్రహీతలకు ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి అభినందనలు తెలిపారు. విశేష ప్రతిభతో అవార్డులు గెలుచుకోవడం గర్వించదగిన విషయమని సీఎం జగన్ పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం మొత్తం 106 మందికి పద్మ అవార్డులను ప్రకటించింది. అందులో ఆరుగురికి పద్మ విభూషణ్, తొమ్మిది మందికి పద్మభూషణ్, 91 మందికి పద్మశ్రీ అవార్డులు దక్కాయి.
ఏపి నుండి పద్మశ్రీ ఆవార్డు గ్రహీతలు
- మ్యూజిక్ డైరెక్టర్ – ఎంఎం కీరవాణి – ఆర్ట్స్
- గణేష్ నాగప్ప – సైన్స్ అండ్ ఇంజనీరింగ్
- సివి రాజు –ఆర్ట్స్
- అబ్బారెడ్డి నాగేశ్వరరావు – సైన్స్ అండ్ ఇంజనీరింగ్
- కోట సచ్చిదానంద శాస్త్రి – ఆర్ట్స్
- సంకురాత్రి చంద్రశేఖర్ – సామాజిక సేవ
- ప్రకాష్ చంద్ర సూదు – లిటరేచర్
తెలంగాణ నుండి పద్మశ్రీ గ్రహీతలు
- పసుపులేటి హనుమంతరావు – మెడిసిన్
- మోదుగు విజయ్ గుప్తా – సైన్స్ అండ్ ఇంజనీరింగ్
- రామకృష్ణారెడ్డి – లిటరేచర్
- చిన జీయర్ స్వామి – ఆథ్యాత్మిక రంగంలో పద్మవిభూషణ్ అవార్డు
- కమలేష్ డి పాటిల్ – అథ్యాత్మిక రంగంలో పద్మ భూషణ్