Central govt: కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్లకు ఎంత డిమాండ్ ఉందో అందరికీ తెలిసిందే. కేంద్రీయ విద్యాలయాల్లో ఎల్ కే జీ సీటు సాధించాన్నా ప్రవేశ పరీక్ష (ఎంట్రెన్స్ టెస్ట్) రాయాల్సి ఉంటుంది. ఇలాంటి కేంద్రీయ విద్యాలయాల ప్రవేశాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాన్ని తీసుకుంది. గత విద్యాసంవత్సరం వరకూ కేంద్రీయ విద్యాలయాల్లో ఎంపీ కోటా కింద పది సీట్లను కేటాయించే వారు. ఎంపీలు ఆ సీట్లను తమకు అనుకూలంగా ఉన్న వారి పిల్లలకు కేటాయిస్తూ సిఫార్సు లేఖలు జారీ చేస్తుంటారు. అయితే కొందరు ఎంపీలు తమ పరిమితికి మించి సిఫార్సు లేఖలు పంపుతున్నారు. దీంతో సీట్ల కేటాయింపుల్లో సమస్యలు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో విద్యాలయాలను పర్యవేక్షించే కేంద్రీయ విద్యాలయ సంఘటన్ తాజాగా ఓ కీలక నిర్ణయం తీసుకుంది.
Central govt: కేంద్రీయ విద్యాలయాల్లో ఎంపీల కోటా రద్దు
సీట్ల కేటాయింపులో ఎంపి కోటాను ఎత్తివేసింది. ఈ మేరకు కేంద్రీయ విద్యాలయాలకు సర్క్యలర్ జారీ చేసింది. జిల్లాకు ఒక కేంద్రీయ విద్యాలయం ఉండగా, ఇప్పుడు ఎంపీలు సీట్ల కోసం సిఫార్సు చేయలేని పరిస్థితి నెలకొంది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఎంపీలకు షాక్ ఇచ్చేలా ఉన్నప్పటికీ మెరిట్ ప్రకారం విద్యాలయాల్లో ఎంట్రన్స్ రాసి సీట్లు సాధించే విద్యార్ధుల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎంపీల కోటా రద్దు చేయడం వల్ల ప్రతి కేంద్రీయ విద్యాలయంలో మరో సీట్లు అర్హత కల్గిన వారికే లభించనున్నాయి.