Omicron Bf-7: చైనా సహా పలు దేశాల్లో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ బీఎఫ్ 7 విజృంభిస్తున్న నేపథ్యంలో కేంద్రం అప్రమత్తంగా వ్యవహరిస్తొంది. కేంద్ర ఆరోగ్య మంత్రి మన్ సుఖ్ మాండవీయ శనివారం కోవిడ్ పై సమీక్ష నిర్వహించారు. అనంతరం కీలక ఆదేశాలు ఆదేశాలు చేశారు. ఇకపై విదేశాల నుండి వచ్చే ప్రయాణీకులకు విమానాశ్రయాల్లోనే ఆర్టీపీసీఆర్ పరీక్షలు తప్పనిసరి చేస్తున్నట్లు తెలిపారు. అయితే చైనా, దక్షిణ కొరియా, జపాన్, హాంకాంగ్, థాయ్ లాండ్ నుండి వచ్చే ప్రయాణీకులకు మాత్రమే ఈ మార్గదర్శకాలు వర్తిస్తాయని చెప్పారు. పరీక్షల్లో ఎవరికైనా పాజిటివ్ వస్తే క్వారంటైన్ సెంటర్ కు తరలిస్తారు.
ఇదే క్రమంలో దేశంలో ఆక్సిజన్ సిలిండెర్ ల లభ్యతపైనా కేంద్రం ఆరా తీసింది. అసుపత్రుల్లో ఆక్సిజన్ సిలిండర్ల విషయంలో ప్రతి వారం సమీక్ష నిర్వహించాలని రాష్ట్రాలకు లేఖ రాసింది. ఆసుపత్రుల్లో లిక్విడ్ ఆక్సిజన్ అందుబాటులో ఉండాలని సూచించింది. ఆక్సిజన్ కంట్రోల్ రూమ్స్ మళ్లీ ఏర్పాటు చేయాలని తెలిపింది. ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్ లు సరిగా పని చేస్తున్నాయా లేదో మాక్ డ్రిల్ నిర్వహించాలని చెప్పింది. ఆక్సిజన్ డిమాండ్ సరఫరా వినియోగంపై ప్రత్యేక యాప్ నిర్వహించాలని రాష్ట్రాలకు సూచించింది కేంద్రం.