Central Govt: ఏపి ఆర్ధిక పరిస్థితి దారుణంగా ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. వివిధ సంక్షేమ పథకాలకు పెద్ద ఎత్తున నిధులు ఖర్చు చేస్తుండటంతో ప్రతి నెలా అప్పులు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. రాబడికి మించి ఖర్చులు ఉండటంతో అప్పులు చేయడం తప్పని సరి అయ్యింది. దీంతో అదనపు రుణం కోసం కేంద్రాన్ని అభ్యర్ధిస్తూ ఉంది రాష్ట్రం. ఈ తరుణంలో కేంద్ర ప్రభుత్వం ఏపికి గుడ్ న్యూస్ అందించింది. అదనపు రుణం పొందేందుకు అవకాశం ఇచ్చింది. విద్యుత్ సంస్కరణలు అమలు చేస్తున్నందుకు గాను ఆంధ్రప్రదేశ్ కు అదనంగా రూ.3,716 కోట్ల అప్పు చేసేందుకు కేంద్రం అవకాశం ఇచ్చింది. ఇలా విద్యుత్ సంస్కరణలు అమలు చేస్తున్న మరో పది రాష్ట్రాలకు కేంద్రం ఇలాంటి వెసులుబాటు కల్పించింది.
Central Govt: ఏపితో సహా పది రాష్ట్రాలకు
ఆంధ్రప్రదేశ్ తో పాటు అస్సొం, హిమాచల్ ప్రదేశ్, మణిపూర్, మేఘాలయ, ఒడిస్సా, రాజస్థాన్, సిక్కింగ్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు గానూ 28,204 కోట్లు అదనపు అప్పు చేసేందుకు అవకాశం ఇచ్చింది.