మూడు రాజధానుల అంశంపై మరోసారి కేంద్రం స్పందించింది. ఇప్పటికే పలుమార్లు ఈ అంశంపై తన వైఖరిని స్పష్టం చేసిన కేంద్రం ఇప్పుడు మరోసారి స్పష్టత ఇచ్చింది. రాజధాని లేదా రాజధానుల నిర్ణయంలో తమ జోక్యం ఉండబోదని కేంద్ర స్పష్టం చేసింది.
పిటీషనర్ దోనే సాంబశివరావువి కేవలం అపోహలే అని హోంశాఖ ఈ మేరకు స్పందించింది. విభజన చట్టం ప్రకారం మూడు రాజధానులు ఉండడం తప్పులేదని తెలిపిన కేంద్రం, అదే చట్టంలో కేవలం ఒకే రాజధాని ఉండాలని ఎక్కడా లేదని తెలిపింది. రాజధానికి అవసరమైన ఆర్ధిక సహాయం తప్పకుండా చేస్తామని కేంద్రం తెలిపింది. అలాగే హైకోర్టు రాజధానిలోనే ఉండాలని ఎక్కడా లేదని కేంద్రం తెలిపింది. ఈమేరకు మూడు రాజధానుల అంశంపై హైకోర్టులో అదనపు అఫిడవిట్ ను కేంద్రం దాఖలు చేసింది.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?