Child : కాలంతో పాటు ఆలోచనా విధానం మారుతుంది. పిల్లలు Child మానసిక విధానం వారు ఆలోచించే తీరు, ప్రవర్తించే గుణం అన్నీ కాలంతోపాటే మారుతున్నాయి. ఈ సమయంలో మారనిది ఒక్కటే అవే భారత చట్టాలు. మిలీనియల్స్ యుగంలో చిన్నారుల మానసిక ప్రవర్తన ఎంతో ఉన్నంతంగా ఉంటోంది. సాధారణ వ్యక్తులు ఆలోచనలకు భిన్నంగా, ఎంతో హై ప్రొఫైల్ ఆలోచనలు వారు చేస్తున్నారు. గతంలో 18 ఏళ్లు దాటిన వరకూ వారని బాలురు గాని పరిగణించేవారు. ఏదైనా నేరం చేసినా వారికి కేవలం వసతిగృహాల పెట్టి కౌన్సిలింగ్ చేసే వారు తప్ప ఎలాంటి చెట్లు ఉండేవి కాదు. దీనినే ఆసరాగా తీసుకుని కొన్ని నేర గ్యాంగ్ లు 18 సంవత్సరాలు నిండని బాలురు తో నేరాలు చేయించడం మొదలు పెట్టాయి. హత్య కేసు లాంటి నేరాలు చేసిన బాలుర జువైనల్ జస్టిస్ ప్రకారం వారికి ఎలాంటి శిక్ష పడకపోవడం అన్న అంశాన్ని తీసుకుని ఈ నేరాలు బాలురతో చేయించడం ఎక్కువైంది. ఎట్టకేలకు జువైనల్ జస్టిస్ చట్టం మీద కేంద్రం కళ్ళు తెరిచింది. కాలంతోపాటు చట్టానికి మార్పులు రావాలి అన్న మాటకు అనుగుణంగా జువైనల్ జస్టిస్ చట్టానికి సవరణలు తీసుకొస్తున్నట్లు కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది.
2015లో తీసుకు వచ్చిన
2015లో ఉన్న జువైనల్ జస్టిస్ యాక్ట్ కు కేంద్ర క్యాబినెట్ పలు సవరణలు ప్రతిపాదించింది. బాలుర వసతి గృహాలను పర్యవేక్షించే అధికారం కలెక్టర్కు ఇస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. గతంలో ఇది శిశుసంరక్షణ అధికారుల కనుసన్నల్లో ఉండేది.
** చిన్నారుల సంరక్షణ కమిటీలో సభ్యులుగా నియమితులయ్యారు వారి నేపథ్యాన్ని పూర్తిస్థాయిలో తనిఖీ చేయాలని భావిస్తున్నారు. చిన్నారుల సంరక్షణ కేంద్రం రిజిస్ట్రేషన్ కు ముందే జిల్లా కలెక్టర్ ఆ సంస్థ యొక్క నేపథ్యాన్ని శక్తిసామర్థ్యాలను తనిఖీ చేసిన తర్వాతే రాష్ట్ర ప్రభుత్వానికి సిఫార్సు చేస్తారు. ఆయా కేంద్రాల్లో చిన్నారులకు సంక్షేమ కమిటీ జువైనల్ పోలీస్ యూనిట్లు రిజిస్టర్డ్ సంరక్షణ కేంద్రాల పనితీరును స్వయంగా చూసిన తర్వాత మాత్రమే సంస్థలకు అనుమతి ఇస్తారు.
చట్టానికి మార్పులు!
తాజాగా జువైనల్ జస్టిస్ చట్టంలోని కొన్ని మార్పులను తీసుకు వచ్చారు.
** చిన్నారుల దత్తు సంబంధించి అన్ని పరిపాలన అధికారులను జిల్లా కలెక్టర్ కు అప్పగిస్తారు. దత్తత కేసులపై పూర్తి నిర్ణయం ఆయనదే. దీనిలో ఏమైనా తేడా ఉంటే డివిజనల్ కమిషనర్ కు అప్లై చేసుకోవచ్చు.
** డ్రగ్స్ మానవ అక్రమ రవాణా ఉచ్చులో చిక్కుకున్న వారు, తల్లిదండ్రులను వదిలేసిన వారిని కూడా ఇక మీదట అవసరం ఉన్నా చిన్నారుల జాబితాలో తీసుకొస్తారు.
** పారిపోయిన చనిపోయినా తల్లిదండ్రుల వద్దకు చేరిన చిన్నారుల పూర్తి డేటా ఇక జిల్లా కలెక్టర్ వద్దకు వస్తుంది. దీనిని రాష్ట్ర ప్రభుత్వానికి పంపుతారు. వారిని ఎలా చదవాలి వారికి ఎలాంటి కార్యక్రమాలు చేయాలని అంశం రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది.
** కనిష్టంగా ఏడేళ్లు శిక్ష పడింది వీలున్న నేరాలు అన్నింటికీ ఒక కొత్త విభాగం కింద తీవ్రమైన నేరాలుగా పరిగణిస్తారు. తీవ్రమైన నేరాలకు శిక్షలు కూడా పెంచారు. అయితే అవి ఎంత మేర పెంచారు అన్నది తెలియకపోయినా ఏడేళ్లు శిక్ష పడే నేరాలు ఇక తీవ్రంగా పరిగణిస్తారు. జువైనల్ చట్టానికి సవరణలు ప్రతిపాదించడం ఇంకా లోతుగా చేయాల్సి ఉంది. ప్రస్తుతం కేంద్ర క్యాబినెట్ తీసుకున్న నిర్ణయాలు కాస్తలో కాస్త బాగానే ఉన్నా.. దీని మీద మరింత విస్తృతమైన చర్చ జరగాల్సి ఉంది.