అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా లోక్సభ స్థానాలకు 548 నామినేషన్లు,అసెంబ్లీ స్థానాలకు 3925 నామినేషన్లు వచ్చాయని ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు. ఎన్నికల నామినేషన్ ప్రక్రియ ముగియడంతో మంగళవారం ద్వివేది మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.
లోక్సభ స్థానాల్లో నంద్యాల నియోజకవర్గానికి అత్యధికంగా 38 నామినేషన్లు రాగా, చిత్తూరుకు 13 నామినేషన్లు వచ్చాయని ద్వివేది చెప్పారు. 15 కంటే ఎక్కువ నామినేషన్లు 17 చోట్ల వచ్చాయన్నారు.
అలాగే అసెంబ్లీ స్థానాల్లో నంద్యాలకు గరిష్టంగా 61 నామినేషన్లు వచ్చాయని ద్వివేది తెలిపారు. అత్యల్పంగా పార్వతీపురం, పాలకొండ నియోజకవర్గాలకు పది నామినేషన్లు వచ్చాయని ఆయన వివరించారు.
రాష్ట్రంలో మొత్తం 3,93,45,717 మంది ఓటర్లు ఉన్నారని ద్వివేది స్పష్టం చేశారు. జనవరి 11 తర్వాత 25 లక్షల కొత్త ఓటర్లు నమోదయ్యారని ద్వివేది తెలిపారు. సి-విజిల్ యాప్ ద్వారా 20,614 ఫిర్యాదులు అందాయని ద్వివేది పేర్కొన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా 734 కేసులు నమోదయ్యాయని, 12 కోట్ల 13 లక్షల ఖరీదైన బంగారం పట్టుకున్నట్లు చెప్పారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?