“ఆగష్టు – 15 దేశమంతటా స్వేచ్చా దినోత్సవ సంబరాల్లో మునిగిన వేళన హైదరాబాద్ లో 49 గృహాల్లో రాబరీ జరిగింది” ఆ ఛేదన కథాఅంశంగా చక్ర రూపొందుతుంది. స్వీయ నిర్మాణంలో విశాల్ హీరోగా నటిస్తున్న ఈ చిత్ర ట్రైలర్ ఈరోజు విడుదలయింది. కేజీఎఫ్ స్టార్ హీరో “యష్”ఈ ట్రైలర్ ని విడుదల చేసారు. విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్ లో విశాల్ స్వయంగా, ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఇప్పుడే విడుదలైన ట్రైలర్ లో ఆసక్తికరమైన అంశాలు జోడించారు. దీనిలో విశాల్ ఆర్మీ లో సైబర్ సెక్యురిటి అధికారిగా కనిపించనున్నారు. హైదరాబాద్ లో జరిగిన రాబరీ కేసుని ఛేదించడానికి ఆయన స్పెషల్ టీమ్ హెడ్ గా వస్తారు. అనంతరం కథలో మలుపులు, వివిధ పాత్రలు, సెంటిమెంట్లుతో ట్రైలర్ నడిచింది. మొత్తానికి ఒక ఆసక్తికరమైన అంశంతో, ట్రైలర్ లోనే థ్రిల్లర్ చూపించారు విశాల్.