(అమరావతి నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి)
తెలుగుదేశం పార్టీకి మరో షాక్ తగిలింది. తూర్పు గోదావరి జిల్లాకు చెందిన సీనియర్ నేత నాయకుడు, పారిశ్రామిక వేత్త చలమలశెట్టి సునీల్ టిడిపికి గుడ్ బై చెప్పి తిరిగి వైసీపీ గూటికి చేరారు. నేడు ఆయన కాకినాడ నుండి ముఖ్య నాయకులతో తాడేపల్లిలోని సిఎం క్యాంప్ కార్యాలయంకు చేరుకోగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి సునీల్కు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు.
ప్రజారాజ్యం తరపున రాజకీయాల్లోకి ప్రవేశించిన చలమలశెట్టి సునీల్ తరువాత వైఎస్ఆర్ కాంగ్రెస్, ఆ తరువాత తెలుగుదేశం పార్టీలో చేరి 2009,2014,2019 పార్లమెంట్ ఎన్నికల్లో పరాజయం పాలైయ్యారు. 2019 ఎన్నికల తరువాత రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి దారుణంగా తయారు కావడంతో చలమలశెట్టి వైసిపిలోకి తిరిగి చేరారు.