తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన గురించి ప్రచారం చేసుకోవడంలో ఓ రేంజ్లో పీక్స్ స్టేజీకి తీసుకుపోతుంటన్నారని ఆయన విమర్శకులు పేర్కొంటున్న సంగతి తెలిసిందే.
అయినప్పటికీ పలు సందర్భాల్లో ఆయన తన వైఖరిని కొనసాగిస్తుంటారు. తాజాగా ఆయన విమర్శకులకు మరోమారు చంద్రబాబు చాన్స్ ఇచ్చారని అంటున్నారు. కరోనా వల్ల ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారు, ఫ్రంట్ లైన్ వారియర్స్ తో టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు జూమ్ వెబినార్ సమావేశం నిర్వహించారని తెలుగుదేశం పార్టీ ప్రకటన విడుదల చేసింది. దీనిపై చంద్రబాబు విమర్శకులు సోషల్ మీడియాలో ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు.
జగన్పై దుమ్మెత్తిపోయందే….
ఎక్కడ ప్రభుత్వాలు సమర్థంగా పనిచేశాయో అక్కడ కరోనా నియంత్రణ సాధ్యమైందని టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు అన్నారు. కరోనా వల్ల ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారు, ఫ్రంట్ లైన్ వారియర్స్ తో వెబినార్ ద్వారా ముఖాముఖి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా చంద్రబాబునాయుడు మాట్లాడుతూ… ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితులు ప్రస్తుతం ఆందోళనకరంగా ఉన్నాయని చంద్రబాబు అన్నారు. ప్రతిపక్షంగా ప్రజల గొంతు వినిపిస్తున్నాను కానీ, సమస్యలను పరిష్కరించేలా చేయలేక పోతున్నానని చంద్రబాబు అన్నారు.
మోదీని భలే వాడేసుకుంటున్నారే
అధికారంలో ఉన్నాను కాబట్టే హుద్ హుద్, తిత్లిలో ప్రభుత్వ యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి రాత్రింబవళ్లు పనులు చేసి బాధితులను ఆదుకున్నామని చంద్రబాబు తన పరిపాలన గురించి చెప్పుకొచ్చారు. “ప్రధాని నరేంద్ర మోది పర్యటనలో విశాఖ వాసులంతా రోడ్లకు ఇరువైపులా నిల్చుని ధన్యవాదాలు తెలిపారు. ఆ స్ఫూర్తి, చొరవ ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వంలో లోపించడం బాధాకరం“ అంటూ ఆనాటి ఘటనలను చంద్రబాబు ఉదహరించారు. తద్వారా మోదీ గురించి సందర్భం లేకున్నా భజన చేశారు. ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల పట్ల బాధ్యతగా ‘‘ఏపి ఫైట్స్ కరోనా’’ వెబ్ సైట్ ప్రారంభించాం అని చంద్రబాబు ప్రకటించారు.
ఈ యువనేత కీర్తించడం మామూలుగా లేదుగా….
ఇక టీడీపీ నేతలు చంద్రబాబు గురించి ఓ రేంజ్లో ప్రశంసించారు. మాజీ మంత్రి, టీడీపీ నాయకుడు, చింతకాయల అయ్యన్నపాత్రుడు కుమారుడు విజయ్ కుమార్ మాట్లాడుతూ, చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో క్రైసిస్ మేనేజ్ మెంట్ ను సమర్థవంతంగా నిర్వహించేవారు అంటూ కొనియాడారు. ప్రస్తుత ప్రభుత్వం చేతగానితనం వల్ల కరోనాతో ప్రజలు ఆర్థికంగా, ఆరోగ్యపరంగా విపరీతంగా నష్టపోయారు అని విశ్లేషించారు.