తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పై నెల్లూరు సిటీ ఎమ్మెల్యే రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తీవ్రంగా ధ్వజమెత్తారు.
మచిలీపట్నంలో ఒక బీసీ నేత హత్యకు గురి అయితే తప్పు చేసినవాడికి శిక్ష పడాలి అని కోరుకోవడం మానేసి హత్యారాజకీయాల సమర్ధిస్తున్నారని ఏపీ మాజీ ముఖ్యమంత్రి పై ఆయన విరుచుకుపడ్డారు.
అనిల్ మాట్లాడుతూ అవతల ఒక వ్యక్తి చనిపోతే కుల రాజకీయాలను ఆపాదిస్తున్నారని మరియు చంద్రబాబు హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. ఇకపోతే కృష్ణ మరియు గోదావరి జిల్లాలో బీసీ నేతలను వేధిస్తున్నారని చంద్రబాబు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని అన్న అనిల్ కుమార్ తప్పు చేసిన వారికి శిక్ష విధించడం లో తప్పేమిటని ప్రశ్నించారు.