ESI కుంభకోణంలో అరెస్టయిన అచ్చెన్నాయుడు ప్రస్తుతం గుంటూరు జీజీహెచ్లో చికిత్స తీసుకుంటున్నారు. రెండు వారాలుగా అచ్చెన్నాయుడు జీజీహెచ్లో ఉండటంతో ప్రస్తుతం అక్కడ కరోనా వైరస్ ఉన్నట్లు వార్తలు రావడంతో తెలుగుదేశం పార్టీలో టెన్షన్ మొదలైంది. జీజీహెచ్లో ముగ్గురు వైద్యులు మరియు ఇద్దరు వైద్య సిబ్బంది అలాగే వైద్యం కోసం వచ్చిన తల్లీ కూతుళ్లకు కరోనా వైరస్ సోకటంతో అచ్చెన్నాయుడు ఆరోగ్యం గురించి కుటుంబ సభ్యులతో పాటు టీడీపీ నేతలు కూడా టెన్షన్ పడుతున్నారు.
ఎప్పటికప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉన్న పెద్దలు ఆసుపత్రిలో ఉన్న వైద్యులను అచ్చెన్నాయుడు ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీస్తూ ఉన్నారట. ముఖ్యంగా ఫైల్స్ సమస్యతో బాధ పడుతున్న అచ్చెం నాయుడికి బీపీ మరియు షుగర్ లెవెల్స్ తగ్గిపోవటంతో పాటు రక్త విరోచనాలు తదితర అనారోగ్య కారణాలతో ఇబ్బంది పడుతుండటంతో అచ్చెన్నాయుడు ఆరోగ్య పరిస్థితి విషమించే అవకాశం ఉందట. దీంతో ఈ వార్త తెలుసుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు హుటాహుటిన గుంటూరు బయలుదేరి అచ్చెన్నాయుడు ని పరామర్శించి కుదిరితే మెరుగైన ఆసుపత్రి తీసుకెళ్లడానికి చంద్రబాబు రెడీ అవుతున్నట్లు టీడీపీ పార్టీ లో టాక్ వినబడుతోంది.