చంద్రబాబు మరియు జగన్ రాజకీయాల దెబ్బకి ఏపీ ఫైనాన్షియల్ షట్ డౌన్ లోకి వెళ్ళిపోయింది. మూడు నాలుగు రోజులపాటు ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేని పరిస్థితి లోకి వెళ్ళిపోయింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో అప్ప్రోప్రియేషన్ బిల్ కు మండలి ఆమోదం తెలపక పోవటమే దీనికి కారణం. దీంతో ఏపీ వ్యాప్తంగా ఆర్థికంగా ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేని పరిస్థితి ఏర్పడటంతో నెల అయినాగానీ ప్రభుత్వ ఉద్యోగస్తులకు జీతం చెల్లించలేని పరిస్థితి ఏర్పడింది. కాగా దీనంతటికి కారణం టీడీపీ నాయకులు అని వైసీపీ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు ఉపయోగపడే బిల్లులను రాజకీయంగా తెలుగుదేశం పార్టీ నేతలు మండలిలో అడ్డుకోవటం వలనే రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితి నెలకొందని విమర్శలు చేస్తున్నారు.
గత అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో మండలిలో ద్రవ్య వినిమయ బిల్లు ఆమోదం పొందకుండా టీడీపీ నేతలు అడ్డుకోవడం వల్లే రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితి ఎదురైంది అని అధికార పార్టీ నేతలు విమర్శలు చేస్తున్నారు. దీంతో సాంకేతిక పరమైన ఇబ్బందులు రావటంతో అది తెలుగుదేశం మరియు వైస్సార్సీపీ రాజకీయ నాయకుల వల్ల కావటంతో ద్రవ్య వినిమయ బిల్లు ఆగిపోవడంతో కరోనా కాలంలో జీతాలు రాక ఉద్యోగస్తులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత నెల 16 వ తారీఖున ద్రవ్య వినిమయ బిల్లు శాసనమండలిలో ఆమోదం పొందకుండా ఆగిపోవటంతో ఇప్పుడు గవర్నర్ ఆమోదం పొందడానికి రెడీ అయింది. దీంతో చంద్రబాబు మరియు జగన్ చేస్తున్న రాజకీయాలపై ప్రభుత్వ అధికారులు మరియు ఉద్యోగస్తుల నుండి విమర్శలు వస్తున్నాయి.
మీ రాజకీయ ఎత్తుగడల కోసం మా జీవితాలతో ఆడుకుంటున్నారు అన్నట్టుగా విమర్శలు చేస్తున్నారు. కరోనా లాంటి కష్టకాలంలో కూడా మమ్మల్ని ముంచే విధంగా మీరు రాజకీయాలు చేస్తున్నారు అని అధికార మరియు ప్రతిపక్ష పార్టీలపై మండిపడుతున్నారు. మీరు మీరు రాజకీయాలు చేసుకుంటే బానే ఉంటుంది మధ్యలో మా జీవితాలు నలిగిపోతున్నాయి, మమ్మల్ని నమ్ముకున్న మా పిల్లల భవిష్యత్తు నరకంగా మారుతుంది అని చాలామంది తాజా పరిస్థితిపై జీతాలు అందుకోలేక అసహనం చెందుతున్నారు.