ESI స్కాం లో అచ్చెన్నాయుడు అరెస్ట్ కావడంతో ఏపీ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఇదే సమయంలో తెలుగుదేశం పార్టీలో టెన్షన్ వాతావరణం నెలకొంది. అచ్చెన్నాయుడు ని అసెంబ్లీ సమావేశాలలో ఎదుర్కోలేక ఇలా అక్రమంగా వైయస్ జగన్ అరెస్టు చేయించారని ఎంపీ రామ్మోహన్నాయుడు విమర్శించారు. పోలీసులు వైసీపీ పార్టీ గూండాల్లా వ్యవహరించారని.. ప్రజాస్వామ్యంలో బతుకుతున్నటు లేదని తెలిపారు.
ఇదిలా ఉండగా అచ్చెన్నాయుడు కుటుంబ సభ్యులతో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు మరియు జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఫోన్లో మాట్లాడటం జరిగింది. అచ్చెన్నాయుడు భార్య బిడ్డలు కి ధైర్యం చెప్పినట్లు సమాచారం. ఈ సమయంలో పోలీసులు కనీసం సమాచారం ఇవ్వకుండా తన భర్తను అరెస్టు చేసినట్లు అచ్చెన్నాయుడు భార్య చంద్రబాబుతో చెప్పుకుని ఆవేదన చెందినట్లు సమాచారం. ఖచ్చితంగా న్యాయం చేస్తామని అచ్చెన్నాయుడు ని బయటకు తీసుకొచ్చే బాధ్యత నాది అని కుటుంబ సభ్యులకు చంద్రబాబు హామీ ఇచ్చినట్లు టీడీపీ పార్టీలో టాక్. మరొక పక్క దేనికైనా సిద్ధమే అని నిరూపించుకోవడం కోసం అచ్చెన్నాయుడు అరెస్టు వ్యవహారంలో జగన్ కు మాస్టర్ స్ట్రోక్ చంద్రబాబు సిద్ధం చేసినట్లు వార్తలు వస్తున్నాయి. పూర్తి మేటర్ లోకి వెళ్తే సరైన లాయర్ తో చంద్రబాబు హైకోర్టులో పిటిషన్ వేసే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.
ఎక్కువగా న్యాయస్థానాల పరంగా వైయస్ జగన్ ని చంద్రబాబు గట్టిగా ఎదుర్కొంటున్న తరుణంలో…అచ్చెన్నాయుడు వ్యవహారాన్ని కూడా ఆ స్థాయిలోనే ఢీ కొనాలని చంద్రబాబు ఆలోచిస్తున్నట్లు సమాచారం. న్యాయస్థానాల పరంగా తీర్పు అనుకూలంగా వస్తే ఒకపక్క సానుభూతి మరోపక్క వైయస్ జగన్ కక్ష సాధింపు చర్యలు తో పరిపాలిస్తున్నాడు అని ప్రజలకు అర్థమవుతోందని, చంద్రబాబు… అచ్చెన్నాయుడు అరెస్ట్ వ్యవహారాన్ని హైకోర్టులో తేల్చుకోవడానికి సరైన లాయర్లతో స్ట్రాంగ్ పాయింట్లతో పిటిషన్ వెయ్యటానికి రెడీగా ఉన్నట్లు సమాచారం.