ఏపీ ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు కరోనా వచ్చిన తర్వాత చాలా వరకు ఏపీ లో కాకుండా హైదరాబాద్ ప్రాంతానికి పరిమితం అయిన సంగతి తెలిసిందే. ఏదైనా అర్జెంటు విషయం ఘటన జరిగితే తప్ప హైదరాబాద్ విడిచి ఏపీ కి రావడం లేదు. హైదరాబాదు లోనే ఉంటూ జూమ్ మీటింగు లతో కార్యకర్తలతో అదేవిధంగా నాయకులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు.
ప్రతి నియోజకవర్గానికి చెందిన టిడిపి నాయకులతో చంద్రబాబు నేరుగా కాకుండా జూమ్ ద్వారానే సంప్రదింపులు జరుపుతున్నారు. పరిస్థితి ఇలా ఉండగా జూమ్ మీటింగులో ఇటీవల చంద్రబాబు మాట్లాడుతూ ఏపీ పోలీసుల పై టిడిపి పార్టీకి చెందిన నాయకులకు కేసులు పెట్టాలని ఆదేశాలు ఇస్తూ చెప్పిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో బయటపడింది.
పోలీసుల పై తప్పుడు కేసులు పెట్టాలని, కేసులు పెట్టడానికి వాళ్లు నిరాకరిస్తే ఆన్ లైన్ ద్వారా ఫిర్యాదు చేయాలని కోరారు. అంతమాత్రమే కాకుండా పోలీసులను భయభ్రాంతులకు గురి చేస్తూ టిడిపి పార్టీ అధికారంలోకి వచ్చాక మీ పని పట్టబోతున్నట్లు బెదిరించాలని టిడిపి క్యాడర్ ని రెచ్చగొట్టే విధంగా చంద్రబాబు మాట్లాడిన వీడియో తాజాగా సోషల్ మీడియాలో బయటపడింది. నిర్మాణాత్మకమైన ప్రతిపక్ష పాత్ర పోషించకుండా కావాలని రాష్ట్రంలో శాంతిభద్రతలు విఘాతం కలిగించేలా బాబు వ్యవహరిస్తున్నట్లు తాజా వీడియో పై అధికార పార్టీ నేతలు మండిపడుతున్నారు. కుట్రపూరితంగా చంద్రబాబు ప్రభుత్వ వ్యవస్థలను తన స్వార్ధ రాజకీయాలకోసం ఉపయోగిస్తున్నట్లు వీడియో లో ఆయన మాట్లాడుతున్న తీరు ఉందని సీరియస్ అవుతున్నారు. చంద్రబాబు మాట్లాడుతున్న ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది.