2019 సార్వత్రిక ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ ఘోరంగా ఓటమి పాలు కావడంతో చాలా మంది పార్టీకి నమ్మకం గా ఉండే నాయకులు ఫలితాలు వచ్చిన వెంటనే వేరే పార్టీలోకి జంప్ అవ్వడం జరిగింది. అసెంబ్లీ స్టార్ట్ అయిన తొలి రోజే భారీ స్థాయిలో విజయం సాధించిన జగన్ నేను గాని ఒక్కసారి గ్రీన్ సిగ్నల్ ఇస్తే… మీ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు రావడానికి చాలా మంది ఉన్నారు…. నీకు ఉన్న ప్రతిపక్ష హోదా కూడా తప్పించడం నాకు పెద్ద మేటర్ ఏమి కాదు అన్న డైలాగ్ కూడా వేయటం అప్పట్లో హైలెట్ అయ్యింది. అయితే తన పార్టీలోకి వచ్చే ఎమ్మెల్యేల విషయంలో కచ్చితంగా రాజీనామా చేయాలని జగన్ షరతు విధించడంతో… టిడిపి నుండి జంప్ అవ్వాలని చూసిన నేతలకు ఒక్కసారిగా షాక్ ఇచ్చినట్లు అయింది.
ఈ క్రమంలో వైసీపీ ప్రభుత్వం సంక్షేమ పరిపాలన అందిస్తూ మరో పక్క టీడీపీలో ఆర్ధికంగా బలంగా ఉండే నాయకులకు వరుసగా షాకుల మీద షాకులు ఇచ్చే కార్యక్రమం మొదలు పెట్టడంతో చాలా మంది నేతలు వైసీపీ లోకి వెళ్లి పోవడం జరిగింది. వైసీపీ లోకి రాని వారి ఆస్తులపై దాడులు చేసేటట్లు ప్రభుత్వం అవలంబించినట్లు వార్తలు రావడంతో టిడిపి లో కీలక నాయకులు వైసీపీ లోకి వెళ్ళటానికి రెడీ అవుతున్నట్లు ఏపీ రాజకీయాల్లో ఒక్కోరోజు ఒక్కొక్కరి గురించి వార్తలు ప్రచారం గత కొద్ది రోజుల నుండి చేయడం జరిగింది. ఈ ప్రచారంలో ఘంటా శ్రీనివాస్, ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్, కొండపి ఎమ్మెల్యే బాల వీరాంజనేయ స్వామి, పర్చూరు ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు, రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ పేర్లు వినపడ్డాయి.
కానీ వీరందరిలో దాదాపు గంటా శ్రీనివాస రావు పేరు ఒక్కటే వెళ్ళడానికి రెడీ అయినట్లు కన్ఫర్మ్ అయినట్లు సమాచారం. మిగతావారు సడన్ గా పార్టీ మార్గమని భావించిన క్రమంలో చంద్రబాబు తనదైన శైలిలో చెక్ పెట్టినట్లు వార్తలు వస్తున్నాయి. పూర్తి విషయంలోకి వెళితే పార్టీ మారుద్దామని అనుకుంటున్న టిడిపి జంపింగ్ జపాంగ్ లకు చంద్రబాబు బంపర్ ఆఫర్ ఇచ్చినట్లు సమాచారం. రాబోయే అసెంబ్లీ ఎన్నికలలో టిడిపి తరఫున పోటీ చేసే అభ్యర్థులను ఆర్థికంగా పార్టీ ఆదుకుంటుందని కాబట్టి ఎవరూ జంపు అవ్వాల్సిన పరిస్థితి లేకుండా చూసుకోవాలని హితవు పలికారట. అంతే కాకుండా వైసీపీ ప్రభుత్వం లో ఎవరైతే ఆర్థికంగా నష్టపోయారు వారందరిని రాబోయే రోజుల్లో పార్టీ ఆదుకునే రీతిలో హామీ ఇచ్చినట్లు సమాచారం. దీంతో చంద్రబాబు ఇచ్చిన ఆఫర్ కి వైసిపి లోకి రావాలని ఎన్ని ఆఫర్లు వస్తున్నా… టిడిపి నుండి బయటకు వెళ్లడానికి ఎమ్మెల్యేలు పెద్దగా ఇంట్రెస్ట్ చూపించడం లేదని సమాచారం.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?