అమరావతి, ఫిబ్రవరి 28: కేంద్రం ప్రకటించిన రైల్వేజోన్ మసిపూసిన మారేడుకాయ అని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు.
కేంద్ర ప్రభుత్వం బుధవారం విశాఖ రైల్వే జోన్ ప్రకటించింది. దీనిపై చంద్రబాబు గురువారం పలు వ్యాఖ్యలు చేశారు.
గురువారం పలువురు టిడిపి నేతలతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఎక్కువ ఆదాయాన్ని పోగొట్టి తక్కువ ఆదాయం వచ్చేలా కుట్ర పన్నారని చంద్రబాబు విమర్శించారు.
విభజన హామీలు అమలు చేయాలంటూ రేపు నల్లబ్యాడ్జీలతో నిరసన తెలపాలని పార్టీ శ్రేణులకు చంద్రబాబు పిలుపు నిచ్చారు.
ఇన్నేళ్లు రాజధాని తరలించాలని వైసిపి మనసులో కుట్ర పెట్టుకుందనీ, ఇప్పుడు అభివృద్ధి చూసి ఏమీచేయలేక రాజధానిని తరలించబోమని చెబుతోందని చంద్రబాబు అన్నారు.
చేసిన మోసాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం వైసిపి చేస్తోందనీ, దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని చంద్రబాబు సూచించారు.
రైల్వే జోన్పై బిజెపి, వైసిపి సంబరాలు హస్యాస్పదమని చంద్రబాబు అన్నారు.