Tirupati by elections: తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికలకు సంబంధించి అధికార పార్టీ వైసీపీ అక్రమాలకు పాల్పడుతోందని టిడిపి అధినేత చంద్రబాబు ఈసీ కి ఫిర్యాదు చేస్తూ లెటర్ రాయడం జరిగింది. ఉప ఎన్నిక జరుగుతున్న ప్రాంతాలలోకి పొరుగు నియోజకవర్గంలో అధికార పార్టీకి చెందిన వ్యక్తులు చొరబడి ఉన్నారని రాష్ట్ర ఎన్నికల కమిషన్ కి లెటర్లో స్పష్టం చేశారు.
సరిహద్దు ప్రాంతాలలో అని చెక్ పోస్టుల వద్ద సరైన భద్రత ఏర్పాట్లు లేవని ఆరోపించారు. పోలింగ్ లో అక్రమాలకు పాల్పడ్డ టానికి చీకటిలో మంతనాలు.. చేస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. రిగ్గింగ్ చేయడానికి వైసిపి ప్రణాళికలు సిద్ధం చేస్తోందని అన్నారు. పుంగనూరు నుంచి బస్సులో భారీగా తిరుపతి పార్లమెంటు పరిధిలో ఉన్న నియోజకవర్గాల్లో కి వస్తున్నారని చంద్రబాబు లేఖలో ఈసీ దృష్టికి తీసుకొచ్చారు. ప్రజాస్వామ్యాన్ని రక్షించాలని ఈసీ చర్యలు తీసుకోవాలని లేఖలో తెలిపారు.