అమరావతి: తెలుగుదేశం పార్టీ శాసన సభా పక్ష నేతగా చంద్రబాబును ఎన్నికయ్యారు. ఉండవల్లి లోని ఆయన నివాసంలో బుధవారం జరిగిన సమావేశంలో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు టి డి ఎల్ పీ నేతగా చంద్రబాబును ఏకగ్రీవంగా ఎన్నుకొన్నారు.
ఎన్నికల్లో పార్టీ ఓటమికి దారి తీసిన కారణాలు, పార్టీ భవిష్యత్తు కార్యాచరణ, త్వరలో జరిగే శాసనసభ సమావేశాల్లో అనుసరించాల్సిన వైఖరి, స్థానిక సంస్థల ఎన్నికలకు సంసిద్ధత, జగన్ ఆహ్వానం, తదితర అంశాలపై చర్చ కొనసాగుతోంది.
కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు ఎంపీలతో పాటు సుజనా చౌదరి, కనకమేడల రవీంద్ర కుమార్, కళా వెంకటరావు, యనమల రామకృష్ణుడు, నిమ్మకాయల చినరాజప్ప, నందమూరి బాలకృష్ణ, నారా లోకేష్, గంటా శ్రీనివాసరావు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి తదితరులు పాల్గొన్నారు.
శాసనసభాపక్ష నేతగా ఈ సారి చంద్రబాబు ఉండకపోవచ్చనీ, సీనియర్ సభ్యులలో ఎవరకైనా అవకాశం ఇస్తారని ప్రచారం జరిగినప్పటికీ వాటిని తెరదించుతూ చంద్రబాబునే టీడీఎల్పీ నేతగా ఎన్నుకున్నారు.