టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. విజయవాడ నుండి హైదరాబాద్ కు ప్రయాణిస్తుండగా ఈ పెను ప్రమాదం తప్పింది. రోడ్డు మార్గంలో ఆయన ప్రయాణిస్తుండగా ఒక ఆవు అడ్డు రావడంతో చంద్రబాబు కాన్వాయ్ లోని ఒక డ్రైవర్ సడెన్ బ్రేక్ వేసాడు.
ఈ సడెన్ ఘటనతో కాన్వాయ్ లోని రెండు, మూడు వాహనాలు ఢీ కొట్టాయి. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం దండుమల్కాపురం వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో చంద్రబాబు సహా ఆ కాన్వాయ్ లో ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనలో వాహనాలు స్వల్పంగా దెబ్బతిన్నాయి. అనంతరం ఘటన తర్వాత కాన్వాయ్ హైదరాబాద్ వైపు.కదిలింది.