ఎవరు ఏమనుకున్నా టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుకు ముందు చూపు ఎక్కువే! మొన్నటి ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయాడని ఆయనను చిన్నచూపు చూడటం కూడా కరెక్ట్ కాదు!
జగన్ ఒక్క ఛాన్స్ నినాదం ప్రజలకు బాగా పట్టింది. టిడిపి ప్రభుత్వ స్వయంకృతాపరాధాలు కూడా చాలానే ఉన్నాయి వెరసి 2019 ఎన్నికల్లో చంద్రబాబు ఘోర పరాజయం పొందారు. అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు కి మిగిలివున్న ప్రతిపక్ష నాయకుడు హోదా కూడా లాగేయడానికి జగన్ ప్రభుత్వం పక్కాగా పావులు కదుపుతోంది.టిడిపికి ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలుండగా ఇప్పటికే నలుగురు వైసిపి వైపు చేశారు.మరో నలుగురు వస్తే చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నాయకుని హోదా కోల్పోతారు.అదే జరిగితే చంద్రబాబు ఇక కుప్పం ఎమ్మెల్యేగా మిగిలిపోతారు.కీడెంచి మేలెంచే స్వభావం కలిగిన చంద్రబాబు ఇప్పుడు తన వ్యూహం మార్చారు.
ఈ కష్టకాలంలో తనను ఆరు కోగలిగింది ఒక బీజేపీయేనని ఆయన కనిపెట్టారు. దీంతో జగన్ ని తిట్టడం తర్వాత.. ముందు మోడీని పొగడాలని బాబు ఫిక్సయ్యారంట!!జగన్ ను తాను ఒంటరిగా ఎదుర్కోలేనని బాబు ఫిక్సయిపోయారంట! అందులో భాగంగానే నమో జపం చేస్తున్నారంట చంద్రబాబు!ఇందులో భాగంగా కేంద్రంలో, పార్లమెంటులో బిజెపికి పూర్తి మద్దతు ఇవ్వాల్సిందిగా తనకున్న ముగ్గురు ముగ్గురు నలుగురు ఎంపీలను చంద్రబాబు ఆదేశించారని సమాచారం బిజెపి అడిగినా అడక్కపోయినా ఆ పార్టీ వెనకే నడవాల్సిందిగా కూడా వారికి బాబు సూచించారని టిడిపి వర్గాలే చెబుతున్నాయి.అయితే ఈ విషయంలో కూడా జగన్ ఆయనకు అడ్డుతగులుతున్నారు.వైసీపీకి పార్లమెంట్ ఉభయ సభల్లో కలిపి ఇరవై ఏడు మంది సభ్యులు ఉన్నారు.
తాజాగా వివాదాస్పద వ్యవసాయ బిల్లుకు శిరోమణీ అకాలీదళ్ కూడా నో చెప్పడంతోపాటు కేంద్ర మంత్రి పదవినే వదులుకున్నా జగన్ మాత్రం మోడి కి జై అన్నారు! దీంతో మోడీ జగన్ ల బంధం మరింత బలపడిపోయింది.అయినప్పటికీ చంద్రబాబు ఏదో విధంగా బిజెపికి ప్రత్యేకించి ప్రధాని నరేంద్ర మోడీకి దగ్గరకావడానికి నానా తంటాలు పడుతున్నారు.ఇప్పుడాయన ప్రధాన టార్గెట్ జగన్ కాదని,నరేంద్ర మోదీ అనుగ్రహం సంపాదించడమే లక్ష్యంగా బాబు రాజకీయం సాగుతోందని టిడిపి వర్గాలు చెబుతున్నాయి.బిజెపి కనుక ఆదుకోకపోతే చంద్రబాబు చరిత్ర 2024 నాటికి ముగిసి పోగలదని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు