Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల వ్యవహారాలు నేతల తీసుకుంటున్న నిర్ణయాలు అధికారులు వ్యవహరిస్తున్న తీరు సార్వత్రిక ఎన్నికల వాతావరణాన్ని తలపిస్తుంది. 2019 సార్వత్రిక ఎన్నికల వాతావరణం కంటే పంచాయతీ ఎన్నికల విషయంలో వైసిపి టిడిపి పార్టీ ల మధ్య పరిస్థితి నువ్వానేనా అన్నట్టుగా ఉంది. ఇదిలా ఉంటే పంచాయతీ ఎన్నికలలో ఏదో విధంగా స్థానాలు గెలిచి ప్రభుత్వం పై వ్యతిరేకత ఉంది అని నిరూపించడానికి చంద్రబాబు Chandrababu అనేక రీతులుగా తాపత్రయ పడుతున్న సంగతి తెలిసిందే. ఇటువంటి తరుణంలో తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉండే సామాజిక వర్గానికి చెందిన నాయకులు ఇటువంటి కీలక సమయంలో చంద్రబాబు కి దిమ్మతిరిగే షాక్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. తాజా షాక్ బట్టి టీడీపీ కోలుకోవటం ఇంపాజిబుల్ అనే టాక్ వినపడుతుంది.
క్లియర్ కట్ మేటర్ లోకి వెళ్తే పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి నియోజకవర్గం ఒకానొక సమయంలో టీడీపీకి కంచుకోట అని అందరికీ తెలుసు. కానీ ఎప్పుడైతే ఈ నియోజకవర్గం ఎస్సీ రిజర్వుడు అయిందో పరిస్థితి మొత్తం తారుమారైంది. ఈ క్రమంలో 2004-0 9 మరియు తర్వాత జరిగిన ఎన్నికలలో ఎప్పుడూ కూడా టిడిపి పార్టీ గెలిచిన సందర్భాలు లేవు. కానీ ఇదే నియోజక వర్గం లో ఉండే కమ్మ సామాజిక నాయక వర్గాలు మాత్రం రాజకీయాన్ని తమ చేతిలో పెట్టుకొని నియోజకవర్గంలో ఎవరు మంత్రి అయిన ఎమ్మెల్యే అయినా వాళ్ళ పెత్తనం లేకుండా తమ పనులు కానించి కుంటూ పోయేవాళ్ళు. ఇదిలా ఉంటే ప్రస్తుతం జరుగుతున్న పంచాయతీ ఎన్నికలలో టిడిపి పార్టీ పరిస్థితి ఇక్కడ చాలా దారుణంగా ఉన్నట్లు కనీసం కమ్మ సామాజిక వర్గానికి చెందిన నాయకులు ఎవ్వరూ కూడా జిల్లా పార్టీ నేతలకు సహకరించడం లేదని, టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఒకలాగా ఇప్పుడు అధికారంలో లేకపోవడంతో ఆ కమ్మటి బ్యాచ్ మొత్తం ఇంటికే పరిమితమైనట్లు ఈ విషయంలో చంద్రబాబు కూడా అసహనంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. సో మొత్తం మీద చూసుకుంటే పశ్చిమగోదావరి జిల్లాలో టిడిపి పార్టీకి సొంత నేతలే దెబ్బ వేస్తున్నట్లు పార్టీలో అంతర్గతంగా వినపడుతున్న టాక్.