జమ్మూ కశ్మీర్ ప్రతిపక్ష నేత ఒమర్ అబ్దుల్లా ఆంధ్రప్రదేశ్ ముఖ్య నేత నారా చంద్రబాబు నాయుడుపై నిప్పులు చెరిగారు. చంద్రబాబు అవకాశవాది అని విమర్శించారు. చంద్రబాబు కోసం తన తండ్రి ఫారూఖ్ అబ్దుల్లా సొంత ఎన్నికలు వదులుకుని ఆంధ్రప్రదేశ్ కు ప్రచారం చేసేందుకు వెళ్లారని, వైఎస్ జగన్ క్లీన్ స్వీప్ చేస్తారని తెలిసినా తన తండ్రి వెనక్కి తగ్గలేదని ఒమర్ అద్బుల్లా అన్నారు.
అలాంటి తమను చంద్రబాబు కష్ట సమయంలో కనీసం పలకరించలేదని, తన అసలు రంగును బయటపెట్టారని తెలిపారు ఒమర్ అబ్దుల్లా. జమ్మూ కశ్మీర్ క్రైసిస్ సమయంలో ఫారూఖ్, ఒమర్ అబ్దుల్లాలను గృహ నిర్బంధంలో ఉంచిన విషయం తెల్సిందే. ఆ సమయంలో కనీసం తమకు ఒక్క ఫోన్ కూడా చేయలేదని ఒమర్ అబ్దుల్లా చంద్రబాబుపై నిప్పులు చెరిగారు.