2019 ఎన్నికల సమయంలో హైదరాబాద్ నుండి నేనే అభివృద్ధి చేశాను, ఐటీ ని తీసుకు వచ్చింది నేనే అంటూ తనని తాను తెగ పొగుడుకుంటూ చంద్రబాబు క్యాంపెయిన్ చేయడం అందరికీ తెలిసిందే. కాని రిజల్ట్ చూసే ఓట్లు ఎక్కడ రాలేదు. అప్పట్లో హలో బాబు కి అనుకూలంగా ఉండే మీడియా కూడా.. చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను జాకీ పైకిలేపి నట్టు కథనాలు మీద కథనాలు కూడా చేసిన.. ప్రజలు తమ తీర్పు ఏంటో స్పష్టంగా ఇచ్చి.. 23 సీట్లతో టిడిపి ని పక్కన కూర్చోబెట్టడం అందరికీ తెలిసిందే.
ఇదిలా ఉంటే గతంలో అభివృద్ధి పేరుతో ఎన్నికల ప్రచారంలో కి వెళ్లిన చంద్రబాబు తాజాగా అదే వ్యూహంలో రివర్స్ గేర్ అన్నట్టుగా ప్రతిపక్ష నేతగా ఇప్పుడు ఆయన చేస్తున్న కామెంట్లు ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారుతున్నాయి. మేటర్ ఏమిటంటే తాను అభివృద్ధి చేయడం తప్పితే క్షమించాలి అని తాజాగా సంక్రాంతి పండుగ సందర్భంగా పలు కార్యక్రమాల్లో పాల్గొన్న చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు.
ఒక్క సంక్రాంతి పండుగ సందర్భం మాత్రమేకాక వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి.. తాను అభివృద్ధి చేసినట్టు, కానీ జనాలు ఓట్లు వెయ్య లేదు అన్నట్టు కామెంట్లు చేస్తూ వస్తున్నారు. ఇప్పుడు కూడా అదే తరహాలో చంద్రబాబు ప్రజలలోకి అభివృద్ధి జపాన్ని బలంగా తీసుకెళ్లాలి అనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. ఇదిలా ఉండగా తిరుపతి ఉప ఎన్నికలలో కూడా ఇదే వ్యూహాన్ని చంద్రబాబు అమలు చేస్తారేమో అని భావిస్తున్నారు విశ్లేషకులు. మరోపక్క బాబుకి నిజంగా రాష్ట్రం అభివృద్ధి చెందాలని ఉంటే.. తన వర్గం ఉన్న అమరావతి ప్రాంతంలో మాత్రమే కాక ఇతర ప్రాంతాల్లో కూడా అభివృద్ధి జరగాలని వైసిపి తీసుకొచ్చిన మూడు రాజధానులు నిర్ణయానికి ఎందుకు అడ్డుపడుతున్నారని.. ఆయన చేసిన వ్యాఖ్యలకు వైసీపీ మద్దతు దారులు కౌంటర్లు వేస్తున్నారు. అసలు చంద్రబాబు హయాంలో అభివృద్ధి ఎక్కడ జరిగింది అని ప్రశ్నిస్తున్నారు. ఎవరికైనా ఉద్యోగాలు వచ్చాయి అని కూడా నిలదీస్తున్నారు. జగన్ అధికారంలోకి వచ్చాక చాలావరకు ఉద్యోగాలు వచ్చాయని.. అభివృద్ధి కూడా జరుగుతోంది అని పేర్కొంటున్నారు. అందువల్లే దేశవ్యాప్తంగా పేరు గాంచిన సర్వే సంస్థలు చేస్తున్న సర్వేలలో టాప్ ఫైవ్ లో సీఎం జగన్ ఉంటున్నారని స్పష్టం చేస్తున్నారు.