సొంత లాభం కోసం చంద్రబాబు ఎంత దారుణానికి అయినా ఒడిగడతారు అని బాబు ప్రత్యర్థులు ఎపుడు అంటుంటారు. ఇప్పుడు ఇదే రీతిలో ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు రాజకీయాలకు సొంత పార్టీ నేతలతో పాటు కొంతమంది అధికారులు బలవుతున్నారని విమర్శలు వార్తలు ఏపీ రాజకీయాల్లో వినబడుతున్నాయి. తాజాగా చంద్రబాబు హయాంలో కార్మికశాఖ మంత్రిగా వ్యవహరించిన అచ్చెన్నాయుడు అరెస్టు వ్యవహారం ఏపీ రాజకీయాలను కుదిపేస్తోంది.
ఇటువంటి తరుణంలో చంద్రబాబు… అచ్చెన్నాయుడు అరెస్ట్ వ్యవహారాన్ని బీసీలను జగన్ అణగ దొక్కేస్తున్నట్లు అనే విధంగా వ్యాఖ్యలు చేస్తూన్నారు. ఒక కిడ్నాప్ చేసినట్లు అచ్చెన్నాయుడు ని తీసుకెళ్లారని దానికి బాధ్యతగా సీఎం జగన్ హోం మంత్రి రాజీనామా చేయాలని, డీజీపీ ఆచూకీ వెల్లడించాలని అచ్చెన్నాయుడు అరెస్ట్ అయిన సమయంలో చంద్రబాబు స్పందించడం జరిగింది. ఈ నేపథ్యంలో బాబు చేసిన వ్యాఖ్యలను బీసీ ఈ వర్గానికి చెందిన వాళ్లు కొంతమంది రకరకాలుగా స్పందిస్తున్నారు. అప్పట్లో నామినేషన్ పదవుల్లో బీసీలకు మొండిచేయి చూపించారు. సంక్షేమ పథకాల్లో బీసీలకు కోతలు విధించారు.. ఇప్పుడూ బీసీ నాయకుడిని అరెస్ట్ చేశారంటూ మొదలుపెట్టారు. ఈ విషయాన్ని ఎవరు ఎలా అర్ధం చేసుకోవాలో బాబే చెప్పాలి అని వ్యాఖ్యానిస్తున్నారు.
తెలంగాణ రాష్ట్రంలో ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయిన టైములో ఆంధ్ర తెలంగాణా అంటూ తనని డిఫెండ్ చేసుకునే విధంగా చంద్రబాబు వ్యవహరించారు, ఇప్పుడు బీసీలు అంటూ అచ్చెన్నాయుడు వ్యవహారంలో చంద్రబాబు వ్యవహరిస్తున్నారు ప్రజలంతా గమనిస్తున్నారని అధికార పార్టీకి చెందినవాళ్లు అంటున్నారు. తన స్వార్ధ రాజకీయం కోసం చంద్రబాబు ఓటుకు నోటు కేసులో తెలంగాణాలో కొంతమంది బీసీ నేత లను ఇరికిస్తే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న టైంలో తన అవినీతి దాహం కోసం బీసీ నేత అచ్చెన్నాయుడు ను చంద్రబాబే ఇరికించారని అధికార పార్టీకి చెందిన వైసీపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ విధంగా తన స్వార్ధం కోసం బీసీ లను బలి చేస్తూనే, బీసీలను వైయస్ జగన్ ఏదో రాజకీయంగా తొక్కేస్తున్నట్లు చిత్రీకరించడానికి టీడీపీ నేతలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారని వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నారు