అమరావతి: ఉపాధి హామీ పథకం పనులపై ప్రభుత్వం నిర్లక్ష్యం వీడాలని టిడిపి అధినేత చంద్రబాబు కోరారు. ఉపాధి హామీ కూలీల సమస్యపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు చంద్రబాబు లేఖ రాశారు.
నాలుగు నెలలుగా జరుగుతున్న పరిణామాలు ఆశ్చర్యాన్ని గురి చేస్తున్నాయని చంద్రబాబు అన్నారు. కూల్చివేతలు, ఒప్పందాల రద్దులతో ప్రభుత్వ వ్యవహార శైలి వివాదాస్పదంగా మారిందని చంద్రబాబు పేర్కొన్నారు.
ఉపాధి హామీ కౌన్సిల్ సభ్యులు రాష్ట్ర మంత్రిని, అధికారులను కలిసినా ఫలితం లేదని లేఖలో చంద్రబాబు పేర్కొన్నారు. తక్షణం ఉపాధి హామీ నిధులు విడుదల చేయాలని చంద్రబాబు కోరారు. ప్రాధాన్యతాక్రమంలో పెండింగ్ బిల్లులు చెల్లించాలనీ, కూలీల జీవనోపాధికి భంగం కలగకుండా చర్యలు తీసుకోవాలనీ చంద్రబాబు కోరారు.
ఉపాధి హామీ పథకం ఈ పాలకుల చేతకానితనం కారణంగా నిర్వీర్యమై పోయింది. ఈ ఏడాది ఇప్పటివరకు కేంద్రం ఇచ్చిన రూ.1845 కోట్ల మెటీరియల్ కాంపోనెంట్ నిధులను ఏం చేశారు? రాష్ట్రవాటా రూ.615 కోట్లను జతచేసి ఎందుకు విడుదల చెయ్యట్లేదు? పెండింగ్ బిల్లులు ఎందుకు చెల్లించడంలేదు?#YSJaganFailedCM pic.twitter.com/syLt7BaSAw
— N Chandrababu Naidu (@ncbn) October 1, 2019