బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు టీడీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడుపై సంచలన వ్యాఖ్యలు చేసారు. చంద్రబాబు నాయుడు వల్లే ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ సున్నా అయిందని వాపోయారు. ఒక ప్రముఖ ఛానల్ లో మాట్లాడుతూ 1996లో మాతో కలిసి రావడానికి చంద్రబాబు నిరాకరించారు.
అయినా మేము 1998లో 18 శాతం ఓట్లను సాధించగలిగాం. వెంటనే చంద్రబాబు మేల్కొని, 96లో మాతో కలిసి రావడానికి నిరాకరించిన ఆయన 98లో మాకు మద్దతు ఇచ్చినట్లే ఇచ్చి మా ఓట్ల శాతాన్ని కూలగొట్టారు. 2014లో మోదీ వచ్చినప్పుడు మళ్ళీ మాతో కలిసాడు. ఇక అప్పటినుండి మమ్మల్ని సర్వనాశనం చేసేవరకూ చంద్రబాబు నిద్రపోలేదు. అయన బీజేపీని ఏ విధంగా చూసాడో, సోము వీర్రాజు తెలుగు దేశాన్ని అలాగే చూస్తాడు అని వ్యాఖ్యానించారు.