అమరావతి, ఫిబ్రవరి 5: కోల్కతాలో సత్యాగ్రహ దీక్ష చేస్తున్న ముఖ్యమంత్రి మమతా బెనర్జీని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు పరామర్శించారు. మంగళవారం సాయంత్రం ఆయన తన తనయుడు ఐటి శాఖ మంత్రి నారా లోకేష్తో కలిసి కోల్కతా వెళ్లారు.
ప్రధాని మోది నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తుందంటూ మమతా బెనర్జీ రెండు రోజులుగా నిరసన దీక్ష చేస్తున్నారు. కాంగ్రెస్తో సహా బిజెపియేతర పక్షాల నేతలు మమత బెనర్జీకి పూర్తి సంఘీభావం తెలియజేశారు.
మంగళవారం సాయంత్రం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అక్కడకు వెళ్లి మమతా బెనర్జీని పరామర్శించి సంఘీభావం తెలియజేశారు.
భవిష్యత్తు కార్యాచరణపై చర్చించినట్లు సమాచారం
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?