అమరావతి: ఫీజు రీయింబర్స్ మెంట్ కోసం ఆందోళన చేస్తున్న విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జి చేయడం పట్ల టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్రంగా మండిపడ్డారు. స్కాలర్ షిప్ లు, ఫీజు రీయింబర్స్ మెంట్ కోరుతూ విద్యార్థులు వీధుల్లోకొచ్చి ఆందోళన చేస్తుంటే ప్రభుత్వం వారిపై లాఠీచార్జి చేయించడం దారుణమని అన్నారు. చదువుకునే విద్యార్థులు రోడ్డెక్కారంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉందో తెలియడంలేదా? అని ప్రశ్నించారు. విద్యార్థుల చదువులు ఆగకుండా ఇకనైనా సర్కారు తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ట్విట్టర్ లో చంద్రబాబు ఓ వీడియో పోస్టు చేశారు.
ఫీజు రీయింబర్స్మెంట్, ఉపకార వేతనాల గురించి విద్యార్థులు వీధుల్లోకొచ్చి ఆందోళన చేస్తుంటే, ప్రభుత్వం వారి మీద లాఠీ ఛార్జ్ చేయించడం దారుణం. చదువుకునే విద్యార్థులు రోడ్డెక్కారంటే సమస్య ఏ స్థాయిలో ఉందో తెలియడంలేదా? విద్యార్థుల చదువులు ఆగకుండా ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి. pic.twitter.com/SNrDqb2fVN
— N Chandrababu Naidu (@ncbn) December 31, 2019