YSRCP : ఇటీవల ప్రతిపక్షనేత చంద్రబాబు వైసీపీ పార్టీ అదే రీతిలో వైయస్ జగన్ పై తీవ్రస్థాయిలో మండిపడిన సంగతి తెలిసిందే. ఎన్నికలలో దాదాపు 42 శాతం టిడిపి గెలిచినట్లు చంద్రబాబు పేర్కొన్నారు. దీంతో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై వైసీపీ మంత్రి కొడాలి నాని స్పందించారు. చంద్రబాబుకి పిచ్చెక్కి మాట్లాడుతున్నారు అని విమర్శల వర్షం కురిపించారు. పంచాయతీ ఎన్నికలలో 42 శాతం టీడీపీ గెలవటం ఏంటి అంటూ ప్రశ్నించారు.
స్వయంగా ఆయన నియోజకవర్గం కుప్పంలో కూడా టిడిపి పార్టీ ఓడిపోయిన పరిస్థితి అని కొడాలి నాని పేర్కొన్నారు. పంచాయతీ ఎన్నికలలో ప్రజలు ఇచ్చిన తీర్పుపై చంద్రబాబు చిన్న మెదడు చితికి పోయిందేమో అందువల్లే ఆయన ఏది పడితే అది మాట్లాడుతున్నారు అని మండిపడ్డారు. అదే రీతిలో ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో సొంత కొడుకుని ఎమ్మెల్యేగా చేసుకోలేని పరిస్థితి చంద్రబాబుది…అయినా సరే సిగ్గు లేదు అంటూ విమర్శించారు. సొంత నియోజకవర్గం కుప్పం ప్రజలు చంద్రబాబుని మర్చిపోయే పరిస్థితి లో ప్రస్తుతం ఉందని అలాంటి తరుణంలో ఆయన గురించి మాట్లాడటం ఇంకా సుద్ధ వేష్టు అంటూ కొడాలి నాని పేర్కొన్నారు. ఆయన త్వరలో ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ లో జాయిన్ అయితే బెటర్ అని లేకపోతే తెలంగాణలో టీడీపీ ని ఎలా సర్వనాశనం చేశారు ఏపీలో కూడా అదే జరుగుతుందని జోస్యం చెప్పారు. దీంతో ప్రస్తుతం టిడిపిలో ఉన్న నాయకులు రోడ్డున పడటం గ్యారెంటీ అని కొడాలి నాని పేర్కొన్నారు. ఖచ్చితంగా మున్సిపల్ ఎన్నికల్లో కూడా వైసీపీ జెండా రాష్ట్రంలో ఉన్న అన్ని స్థానాల్లో గెలవటం గ్యారెంటీ అని తెలిపారు. జగన్ పాలన పట్ల రాష్ట్ర ప్రజలకు నమ్మకం కుదిరింది ఖచ్చితంగా జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో కూడా వైసిపి వారి స్థాయిలో గెలుస్తుంది అని కొడాలి నాని స్పష్టం చేశారు.