(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
అమరావతి: హెరిటేజ్ ఫ్రెష్లో అధిక ధరలకు ఉల్లిపాయలను విక్రయిస్తున్నారంటూ సిఎం జగన్మోహనరెడ్డి అసెంబ్లీలో అనడంపై టిడిపి అధినేత నారా చంద్రబాబు సతీమణి భువనేశ్వరి స్పందించారు.
అసెంబ్లీలో ఏమి మాట్లాడుతున్నారో తనకు తెలియదనీ, తాను అసెంబ్లీ సమావేశాలను చూడనని తెలిపారు. హెరిటేజ్ ఫ్రెష్ ఇప్పుడు తమ కింద లేదు. ఫ్యూచర్ గ్రూపు ఆధ్వర్యంలో నడుస్తోందని భువనేశ్వరి పేర్కొన్నారు.
ఉల్లి ధర ఇంతగా పెరిగిపోవడం గతంలో ఎప్పుడూలేదన్నారు. సాధారణ గృహిణిగా ఉల్లి ధర పెరగడం సమర్థించనని పేర్కొన్నారు. త్వరగా ఉల్లి సమస్యను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పరిష్కరించాలని భువనేశ్వరి కోరారు.