వైకాపాలో కాస్త అసంతృప్తి జ్వాలలు పెరుగుతున్న దశ ఇది. ఇది అతి తొందర్లోనే పోతుందా లేక ఇలానే కంటిన్యూ అవుతుందా అన్న సంగతి కాసేపు పక్కనపెడితే… ఈ విషయాన్ని క్యాష్ చేసుకోవాలని టీడీపీ నేతలు అప్పుడే స్కెచ్ లు, ప్లాన్ లూ వేసేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా వెలుగులోకి వచ్చిన ఒక ఫోన్ కాల్ వ్యవహారం బాబును కొత్త ఆలోచనలో పాడేసిందని, ఆ సలహాను ఇప్పుడే పాటించేద్దామా లేక మరికొంతకాలం వెయిట్ చేద్దామా అనేది బాబు ఆలోచిస్తున్నారని తెలుస్తుంది. ఇంతకూ ఆ ఫోన్ కాల్ ఏమిటి, బాబు స్కెచ్ ఏమిటి అనేది ఇప్పుడు చూద్దాం.
కొందరికి మంత్రి పదవులు ఇవ్వలేదని.. మరికొందరికి నిధులు ఇవ్వడం లేదని.. ఇలా రకరకాల కోణాల్లో వైకాపాలో అసంతృప్తి ఉంది. ఈ నేపథ్యంలో వీరి అసంతృప్తిని తగ్గించేందుకు జగన్కు కొంత సంకట స్థితి ఏర్పడిందనే చెప్పాలి. ఈ క్రమంలోనే తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబుకు ఒక సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి అయిన తూర్పు గోదావరికి చెందిన ఓ నాయకుడు ఫోన్ చేశారట. “సార్.. ఈ సయమంలో వైకాపాలో ఉన్న అసంతృప్తి నేతలను మనవైపునకు తిప్పుకుందామా? అని అన్నారని టీడీపీలోనే పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. అంటే… ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అవసరమైనంత మెజారిటీ లేకపోయినా.. కనీసం జగన్ కు ఉన్న మెజారిటీని తగ్గించడం ద్వారా అయ్యినా వ్యూహాత్మకంగా పావులు కదుపుదామని, తద్వారా ఎన్నికలకు వెళ్దామని చెప్పారట. వినేవారికి ఇది కాస్త అత్యేసే అయినా బాబు కూడా ఈ ఫోన్ కాల్ కు సానుకూలంగానే స్పందించారని అంటున్నారు.
ప్రస్తుతం ఈ టాపిక్ టీడీపీ లో హాట్ టాపిక్ గా మారిందనే చెప్పాలి. అయితే… బాబు సానుకూలంగా స్పందించినా కూడా ఇంకాస్త సమయం ఎదురుచూస్తే మంచిది అనే అభిప్రాయాన్ని వెళ్లబుచ్చారంట. ఎందుకంటే… అసంతృప్తితో ఉన్న నేతలతో జగన్ మాట్లాడారా.. మాట్లాడితే ఏమి మాట్లాడారు.. ఎలాంటి హామీలు ఇచ్చారు అనే విషయంలో స్పష్టత లేకుండా ముందుకు వెళ్తే మొదటికే మోసం వస్తుందని బాబు ఆలోచిస్తున్నారంట. ఈ క్రమంలో మరో రెండు లేక మూడు నెలలు ఆగిన అనంతరం రంగంలోకి దిగుదామని బాబు సూచించారట.
ఎందుకంటే… ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో వైకాపాలో ఇంకా అసంతృప్తి పెరుగుతుందా, లేక ఈ నలుగురైదుగురి దగ్గరే ఆగిపోతుందా అనేదానికి ఇంకాస్త సమయం పట్టే పరిస్థితి ఉంది. అంటే.. మరో ఐదారు మాసాల్లో జగన్ కనుక సర్దుబాటు చేసుకోకపోతే.. చంద్రబాబు రంగంలోకి దిగి, తన అనుభవాన్ని అంతా రంగరించి జగన్ కు ఎసరు పెడతారని టీడీపీలో చర్చ నడుస్తోంది. మరి బాబు వ్యూహాలు ఫలిస్తాయా.. జగనే ఈ లోపు సర్ధుబాట్లు చేసుకుంటారా అనేది వేచి చూడాల్సిన విషయం!