Tdp Janasena: టీడీపీ-జనసేన మధ్య పొత్తు ఉంటుందా..? 2024 ఎన్నికలకు కలిసే వెళ్తారా..? అంతర్గతంగా ఆ రెండు పార్టీల మధ్య స్నేహం కొనసాగుతోందా..? కలిస్తే.. 2014 మ్యాజిక్ రిపీట్ అవుతుందా..? టీడీపీకి జనసేన ఏకపక్షంగా మద్ధతిస్తుందా.. పదవులు ఆశిస్తుందా..? ఇవన్నీ రాజకీయ వర్గాల్లో.. రెండు పార్టీల నేతల్లో ఉన్న మాటలే. అయితే.. ప్రస్తుతానికి ఇవేమీ బయటకు రానివి. ఇటివల కుప్పంలో జనసేనతో మైత్రిపై చంద్రబాబు చెప్పిన లవ్ స్టోరీ కూడా ఇదే నిరూపిస్తోంది. దీనిపై పవన్ కల్యాణ్ ఇంకా స్పందించలేదు. బీజేపీ ఈ పరిణామాల్ని నిశితంగా పరిశీలుస్తుంటే.. వైసీపీ ఈ అవకాశం కోసమే ఎదురు చూస్తుందని చెప్పాలి.
అప్పటి వరకూ గోప్యమేనా..
2014 ఎన్నికల్లో (Tdp Janasena) టీడీపీ గెలుపులో జనసేన కీలక పాత్ర పోషించింది. అయితే.. తర్వాత రెండు పార్టీల మధ్య విబేధాలొచ్చి 2019లో విడివిడిగా పోటీ చేశారు. వైసీపీ అధికారంలోకి రావడంతో.. ఇప్పుడు వీరిద్దరి ఉమ్మడి శత్రువు వైసీపీని వచ్చే ఎన్నికల్లో ఓడించాలంటే రాజకీయంగా మళ్లీ ఇద్దరు కలవాల్సిన పరిస్థితులు వచ్చాయి. అయితే.. జనసేన ప్రస్తుతం బీజేపీతో పొత్తులో ఉంది. అయితే.. 2024 ఎన్నికలకు ఆరు నెలల ముందు ఈ రెండు పార్టీలు కలిసి ఉమ్మడిగా పోటీ చేస్తాయని అంటున్నారు. శాసనమండలి మాజీ చైర్మన్ షరీఫ్ ఇటివల చేసిన వ్యాఖ్యలు ప్రస్తావనార్హం. అయితే.. పొత్తులనేవి అప్పటికప్పుడు మాత్రమే నిర్ణయమవుతాయి.. అని చంద్రబాబు కుప్పంలో చెప్పారు. దీంతో ఎప్పటిలానే జనసేనను టార్గెట్ చేయడం వైసీపీకి చిన్న విషయమే.
వైసీపీ వ్యూహమిదేనా..
టీడీపీ-జనసేన ఎన్నికల ముందు వైసీపీ వైఫల్యాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి లబ్ది పొందాలని చూస్తున్నాయని చెప్పాలి. ఇప్పటినుంచే పొత్తుల గురించి మాట్లాడితే ప్రజల్లో తప్పుడు సంకేతాలు వెళ్లే అవకాశం ఉన్న విషయాన్ని రెండు పార్టీలకు తెలుసు. ఇదే జరిగితే.. ‘పవన్ కల్యాణ్ ప్యాకేజీ స్టార్.. చంద్రబాబు చెప్పినట్టే చేస్తారు. ఇతర పార్టీలతో పొత్తులు జనసేనకు అలవాటు. కమ్మ సామాజికవర్గంతో పవన్ కలసి వెళ్తూ కాపులకు అన్యాయం చేస్తున్నారు’ అనే ప్రచారాన్ని ప్రజల్లోకి వైసీపీ ప్రజల్లోకి తీసుకెళ్లడం వైసీపీకి చాలా చిన్న విషయం. ఇలా జనసేనను వీక్ చేసి అటు (Tdp Janasena) టీడీపీ.. ఇటు జనసేనకు కూడా ఓట్లలో చీలిక తెచ్చి వైసీపీ లబ్ది పొందడమనేది రాజకీయ ఎత్తుగడే అవుతుంది. అందుకే.. టీడీపీ-జనసేన ఆచితూచి అడుగులు వేస్తున్నాయని చొప్పొచ్చు.